ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Jun 8, 2022, 10:10 AM IST

Updated : Jun 8, 2022, 12:27 PM IST

gold-price-today
gold-price-today

Gold Price Today: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,600గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,900గా ఉంది.

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు బుధవారం పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర క్రితంరోజుతో పోలిస్తే రూ.100 పెరిగింది. ప్రస్తుతం రూ.52,600 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.400 వరకు పెరిగింది. ప్రస్తుతం రూ.63,900కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,600గా ఉంది. కిలో వెండి ధర రూ.63,900 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,900గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,600గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,900 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,600గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,900 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా పెరిగింది. ఔన్సు బంగారం 1848 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22.15 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ రూ. 77.69కి చేరింది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ పెరిగింది. ప్రస్తుతం రూ. 24,61,878వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,61,878
ఇథీరియంరూ.1,44,908
టెథర్రూ.81.93
బినాన్స్​ కాయిన్రూ.23,408
యూఎస్​డీ కాయిన్రూ.82.12

Stock Market Live Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు బుధవారం సెషన్​లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ దాదాపు 350 పాయింట్లుపైగా కోల్పోయి.. 54 వేల 730 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 100 పాయింట్లు పతనమై.. 16 వేల 300 వద్ద ఉంది. టాటాస్టీల్​, కోటక్​ బ్యాంక్​, ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ. యాక్సిస్​ బ్యాంక్, పవర్​ గ్రిడ్​​ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్​, సన్​ఫార్మా, రిలయన్స్​, మారుతీ అత్యధికంగా నష్టపోయాయి.

ఇవీ చదవండి: సామాన్యుడా.. వడ్డీల మోతకు సిద్ధమవ్వు! ఈఎంఐలు మరింత భారం!

భారత వృద్ధి రేటును 7.5 శాతానికి తగ్గించిన ప్రపంచ బ్యాంక్‌

Last Updated :Jun 8, 2022, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.