ETV Bharat / business

ట్విట్టర్​ సీఈఓకు మస్క్ వార్నింగ్​.. డీల్‌ రద్దుకు ముందే మెసేజ్‌?

author img

By

Published : Jul 17, 2022, 12:10 PM IST

Twitter-Musk
Twitter-Musk

టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్, ట్విట్టర్​ వివాదంలో తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. డీల్‌ను రద్దు చేసుకోవడానికి ముందే మస్క్‌.. ట్విట్టర్​ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌కు ఓ సందేశం పంపినట్లు తెలుస్తోంది. కొనుగోలు కోసం తాను సమీకరిస్తున్న నిధుల వనరులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ట్విట్టర్​ న్యాయవాదులు అడుగుతున్నారని ఆయన దాంట్లో పేర్కొన్నారు.

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌, ట్విట్టర్​ మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ట్విట్టర్​ కొనుగోలు ఒప్పందం నుంచి వెనక్కి తగ్గిన మస్క్‌పై ఇటీవలే ఆ సంస్థ కోర్టులో దావా వేసింది. దీంతో ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం కొనసాగే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. డీల్‌ను రద్దు చేసుకోవడానికి ముందే మస్క్‌ ట్విట్టర్​ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌కు ఓ సందేశం పంపినట్లు తెలుస్తోంది. కొనుగోలు కోసం తాను సమీకరిస్తున్న నిధుల వనరులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ట్విట్టర్​ న్యాయవాదులు అడుగుతున్నారని ఆయన దాంట్లో పేర్కొన్నారు. ఫలితంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే దీన్ని ఆపాలని కోరారు.

ట్విట్టర్​ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు మస్క్‌ ఇటీవలే ప్రకటించారు. ట్విట్టర్​ను 44 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేయాల్సిందేనంటూ ఆ కంపెనీ ఇటీవల మస్క్‌పై దావా వేసింది. దీనిపై మస్క్‌ మండిపడ్డారు. విచారణ సంసిద్ధతకు నెలల సమయం పట్టవచ్చని అన్నారు. ట్విట్టర్​ కావాలనే నకిలీ ఖాతాల సమాచారాన్ని నొక్కిపెట్టి ఉంచిందని మస్క్‌ తరఫు న్యాయవాదులు డెలావర్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఛాన్సరీలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక వేగవంతమైన విచారణకు ట్విట్టర్​ చేసుకున్న విజ్ఞప్తిపైనా విమర్శలు చేశారు. నకిలీ ఖాతాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను ఇవ్వడానికి ట్విట్టర్​ నుంచి సమాచారం తెలుసుకోవడానికి నెలల సమయం పట్టొచ్చని వ్యాఖ్యానించారు. దీంతో ట్విట్టర్​ న్యాయపోరాటం మొదలుపెట్టింది. ఇద్దరు అత్యున్నత స్థాయి మేనేజర్లను మస్క్‌కు తెలియకుండా తొలగించడం ద్వారా కొనుగోలు ఒప్పందాన్ని ట్విట్టర్​ ఉల్లంఘించిందన్న ఆరోపణలతో పాటు పలు అంశాలను కోర్టుకు మస్క్‌ న్యాయవాదులు తెలియపరిచారు.

ఇవీ చదవండి: 'పెరుగుతున్న గిరాకీ.. ఎంఎన్​సీల చూపు భారత్​ వైపు.. 2030 నాటికి అలా..'

సామాన్యుడిపై మరో పిడుగు.. నిత్యావసర ధరలు పైపైకి.. పాలు, పెరుగు సహా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.