ETV Bharat / business

Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

author img

By

Published : Jun 22, 2021, 3:52 PM IST

Updated : Jun 22, 2021, 4:54 PM IST

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. మంగళవారం సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 14 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty Today) 26 పాయింట్లు బలపడింది.

Share market latest updates
స్టాక్స్ లేటెస్ట్ అప్​డేట్స్​

ఒడుదొడుకుల సెషన్​లో స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్(Sensex today) అతి స్వల్పంగా 14 పాయింట్లు పెరిగి 52,589 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 26 పాయింట్ల లాభంతో 15,773 వద్దకు చేరింది.

సెషన్​ మొత్తం ఒడుదొడుకుల్లో సాగగా.. ఇంట్రాడేలో జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి సూచీలు. బ్యాంకింగ్, ఎఫ్​ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఒడుదొడుకులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 53,057 పాయింట్ల అత్యధిక స్థాయి(జీవన కాల గరిష్ఠం), 52,520 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,895 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,752 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

మారుతీ, ఎల్​&టీ, అల్ట్రాటెక్ సిమెంట్​, టీసీఎస్​, టైటాన్​, ఇన్ఫోసిస్​ ప్రధానంగా లాభాలను గడించాయి.

ఏషియన్ పెయింట్స్​, బజాజ్ ఫినాన్స్, నెస్లే ఇండియా, హెచ్​యూఎల్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, కోస్పీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. హాంగ్​సెంగ్​ సూచీ మాత్రం నష్టాలతో ముగిసింది.

ఇదీ చదవండి:విద్యుత్ వాహనాల మార్కెట్ ఏటా 26శాతం వృద్ధి!

Last Updated : Jun 22, 2021, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.