ETV Bharat / business

STOCK MARKETS: మార్కెట్లలో జోష్- సెన్సెక్స్ 130 ప్లస్

author img

By

Published : Aug 12, 2021, 9:24 AM IST

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex today) 125 పాయింట్ల లాభంతో 54,400 ఎగువన స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 20 పాయింట్ల లాభంతో 16,250 మార్క్​ దాటింది.

STOCKS
స్టాక్ మార్కెట్ లైవ్ అప్​డేట్స్

09:16 August 12

స్టాక్ మార్కెట్ లైవ్ అప్​డేట్స్

స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ.. సెన్సెక్స్ 138 పాయింట్లు వృద్ధి చెంది 54,664 వద్ద ట్రేడవుతోంది. 

సెన్సెక్స్​లోని 30 షేర్లలో పవర్ గ్రిడ్ అత్యధికంగా 1.96 శాతం లాభపడింది. ఐటీసీ, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్​టెల్, టాటా స్టీల్ షేర్లు రాణిస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ షేరు పతనం కాగా.. కోటక్ బ్యాంక్, హెచ్​యూఎల్, సన్​ఫార్మా షేర్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి.

మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాలతోనే ట్రేడింగ్ ఆరంభించింది. 29 పాయింట్లు ఎగబాకి.. 16,311 వద్ద కొనసాగుతోంది. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.