ETV Bharat / business

Stock Market: పుంజుకున్న సూచీలు​​- సెన్సెక్స్ 200 ప్లస్

author img

By

Published : Feb 8, 2022, 9:34 AM IST

Updated : Feb 8, 2022, 3:11 PM IST

stock market live
stock market live

15:04 February 08

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం సెషన్​ ప్రారంభం నుంచి ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. అనంతరం లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది. 57,840 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

అటు నిఫ్టీ సైతం పుంజుకుంది. 70 పాయింట్ల లాభంతో 17,283 వద్ద కదలాడుతోంది.

12:33 February 08

తేరుకున్న మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల నుంచి లాభాల బాట పట్టాయి. లోహ, ఫార్మా షేర్ల దన్నుతో సూచీలు తిరిగి పుంజుకున్నాయి. సెన్సెక్స్​ 100 పాయింట్లకుపైగా మెరుగుపడి.. 57,799 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 17,258 వద్ద కదలాడుతోంది.

  • బజాజ్​, టాటాస్టీల్​, ఏషియన్​పెయింట్​, రిలయన్స్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • పవర్​గ్రిడ్​, టీసీఎస్​, ఎల్​ అండ్​ టీ, కోటక్​బ్యాంకు, అల్ట్రాటెక్​సిమెంట్​ ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:03 February 08

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​సీ-సెన్సెక్స్​ 500 పాయింట్లకుపైగా పతనమై 57,093 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సైతం.. 150 పాయింట్లకుపైగా కోల్పోయి.. 17,059 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

30 షేర్ల సూచీలో బజాబ్​ఫిన్​సెర్వ్​, బజాబ్​ ఫైనాన్స్​, డాక్టర్​ రెడ్డీస్​, ఏషియన్​పెయింట్​ మినహా మిగతా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాలకు కారణాలివే..!

ఆర్​బీఐ ద్రవ్యపరపతి విదాన సమీక్షా సమావేశం నేడు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్భణాన్ని స్థిరంగా ఉంచేందుకు వడ్డీరేట్లను పెంచుతారు అనే ఊహాగానాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతుడటం వల్ల మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

10:17 February 08

దేశీయ సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. లాభాల్లో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు.. క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్​ 100 పాయింట్లకుపైగా నష్టంతో 57,467 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 31 పాయింట్ల తగ్గి 17,182 వద్ద ట్రేడవుతోంది.

పవర్​, ఐటీ, ప్రభుత్వ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడితో సూచీల నష్టాల్లో జారుకున్నాయి. మరోవైపు ఫార్మా షేర్లు రాణిస్తున్నాయి.

09:15 February 08

స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

stock market: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 100 పాయింట్లకుపైగా లాభంతో.. 57,722 వద్ద కదలాడుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి.. 17,254 పాయింట్ల వద్ద ట్రేవడుతోంది.

Last Updated :Feb 8, 2022, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.