ETV Bharat / business

మార్కెట్ల రికార్డు నష్టాల్లోనూ 'డాక్టర్​ రెడ్డీస్​' జోరు

author img

By

Published : Apr 12, 2021, 9:34 AM IST

Updated : Apr 12, 2021, 3:50 PM IST

stock market news live
స్టాక్​ మార్కెట్ వార్తలు లైవ్

15:36 April 12

స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1,708 పాయింట్లు కోల్పోయి.. 47,883 వద్ద ముగించింది. నిఫ్టీ 524 పాయింట్లు నష్టపోయి 14,310 వద్ద స్థిరపడింది.

లాభనష్టాలు.. 

30 షేర్ల ఇండెక్స్​లో డాక్టర్​ రెడ్డీస్​ మాత్రమే లాభాలను గడించింది. ఈ సంస్థ షేరు విలువ ఈ ఒక్కరోజే దాదాపు 5 శాతం మేర పెరిగింది. భారత్​లో స్పుత్నిక్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినట్లు తెలియడం, ఆ టీకాను డాక్టర్​ రెడ్డీస్​ తయారు చేస్తుండటం ఇందుకు ప్రధాన కారణం.

దాదాపు అన్నీ బ్యాంక్​ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ అత్యధికంగా 8.60 శాతం క్షీణించింది. 

14:33 April 12

Sensex 30 shares
30 షేర్ల ఇండెక్స్

స్టాక్ మార్కెట్లలో బేర్​ విజృంభిస్తోంది. సెన్సెక్స్​ 1,800 పాయింట్లకు పైగా కోల్పోయి.. 47,788 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 560 పాయింట్లు నష్టపోయి 14,282 వద్ద కొనసాగుతోంది.

13:42 April 12

మిడ్​ సెషన్​లోనూ మారని పరిస్థితి

స్టాక్​ మార్కెట్​లో​ భారీ నష్టాల పరంపరం కొనసాగుతోంది. సెన్సెక్స్​ 1,728 పాయింట్లకు పైగా కోల్పోయి.. 47,862 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 519 పాయింట్లు నష్టపోయి 14,319 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్​, నిఫ్టీ సుమారు 3.5శాతం మేర ఈ ఒక్కరోజులోనే క్షీణించాయి. 

12:49 April 12

ఆగని నష్టాలు..

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 1,700 పాయింట్లకు పైగా కోల్పోయి.. 47,889 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 520 పాయింట్లు నష్టపోయి 14,317 వద్ద కొనసాగుతోంది.

అన్ని రంగాల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఇండస్​ఇండ్​ బ్యాంక్ అత్యధికంగా 8 శాతానికి పైగా నష్టాల్లో ఉంది.

30 షేర్ల ఇండెక్స్​లో డాక్టర్​ రెడ్డీస్​ మాత్రమే లాభాల్లో ట్రేడవుతోంది.

12:00 April 12

అన్ని రంగాలు నష్టాల్లోనే..

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి నష్టాల్లోకి జారుకుంటున్నాయి. సెన్సెక్స్ 1,690 పాయింట్లకుపైగా కోల్పోయి 47,897వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 500 పాయింట్లకుపైగా తగ్గి.. 14,334 వద్ద కొనసాగుతోంది.

డాక్టర్ రెడ్డీస్​ మినహా 30 షేర్ల ఇండెక్స్​లోని కంపెనీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.

బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, ఎం&ఎం, బజాజ్ ఫిన్​సర్వ్​ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.

09:42 April 12

బజాజ్ షేర్లు బేజారు..

దేశంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం స్టాక్​ మార్కెట్లపై తీవ్రంగా పడింది. సెన్సెక్స్ దాదాపు 1,190 పాయింట్లు పతనమై 48,404 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 350 పాయింట్లు కోల్పోయి 14,487 వద్ద కొనసాగుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లో 27.. నిఫ్టీ-50లో 40కిపైగా కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.

డాక్టర్​ రెడ్డీస్​, సన్​ఫార్మా, ఇన్ఫోసిస్​ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, బజాజ్ ఫినాన్స్, బజాజ్​ ఫిన్​సర్వ్​, బజాజ్ ఆటో షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

  • దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా ఆంక్షలను కఠినతరం చేయడం వ్యాపారాలపై మళ్లీ ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి.
  • ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు.. మార్చి నెల రిటైల్​ ద్రవ్యోల్బణ లెక్కలు సోమవారం వెల్లడి కానున్నాయి. ఈ గణాంకాలపై ప్రతికూల అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
  • సోమవారమే టీసీఎస్ 2020-21 చివరి త్రైమాసిక ఫలితాలు విడుదలవనున్నాయి.

09:01 April 12

మార్కెట్లకు కరోనా కష్టాలు..

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

బీఎస్​ఈ-సెన్సెక్స్​ 1,290 పాయింట్లకు పైగా కోల్పోయి.. 48,298 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 420 పాయింట్లకుపైగా నష్టపోయి.. 14,411 వద్ద కొనసాగుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లో ఇన్ఫోసిస్​ మినహా మిగతా కంపెనీలన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated :Apr 12, 2021, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.