ETV Bharat / business

ఆర్​బీఐ ప్రకటనతో జోష్- స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు

author img

By

Published : Feb 10, 2022, 3:36 PM IST

Stock Market Closing today: వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 90 పాయింట్లు ఎగబాకింది.

STOCK MARKET CLOSING
STOCK MARKET CLOSING

Share Market Closing today: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో జోష్ నింపింది. దీంతో బ్యాంకింగ్ రంగ షేర్లు సూచీలను నడిపించాయి. ఐటీ షేర్లు సైతం రాణించడం వల్ల.. లాభాలు భారీగా నమోదయ్యాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 460 పాయింట్లు లాభపడింది. ఆర్​బీఐ ప్రకటనకు ముందు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీ.. ఓ దశలో 58,332 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అనంతరం పుంజుకొని 500 పాయింట్లు లాభంతో ట్రేడింగ్ సాగించింది. చివరకు 58,926 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 షేర్లలో టాటా స్టీల్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎస్​బీఐ విప్రో, పవర్ గ్రిడ్ తదిదర షేర్లు లాభాలు నమోదు చేశాయి. మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి.

అటు నిఫ్టీ సైతం లాభాలతో ట్రేడింగ్ ముగించింది. 90 పాయింట్లు వృద్ధి చెంది 17,554 వద్ద స్థిరపడింది.

RBI Monetary Policy: కీలక వడ్డీరేట్లను ఆర్​బీఐ వరుసగా పదోసారి యథాతథంగా ఉంచింది. 3 రోజుల సమీక్ష అనంతరం.. ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) నిర్ణయాలను గురువారం ప్రకటించారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో.. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆర్​బీఐ నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందుకు కమిటీ సభ్యులు అంతా అంగీకరించారని వెల్లడించారు.

ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్​బీఐ కీలక ప్రకటన- వరుసగా పదోసారీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.