ETV Bharat / business

కరోనా క్రాష్​: భారీ పతనంతో వార్షిక ఏడాది ఆరంభం

author img

By

Published : Apr 1, 2020, 3:51 PM IST

Updated : Apr 1, 2020, 4:18 PM IST

కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,203 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 343 పాయింట్ల నష్టంతో సెషన్‌ ముగించింది.

స్టాక్​ మార్కెట్లు
STOCKS

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తీవ్ర మాంద్యంలోకి జారుకుంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు వార్షిక ఏడాదిని భారీ నష్టాలతో ప్రారంభించాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,203 పాయింట్ల నష్టంతో 28,265 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 343 పాయింట్లు క్షీణించి.. 8,253 వద్ద ముగిసింది.

కరోనా భయాలు మదుపరులను కలవరపాటుకు గురిచేశాయి. కొవిడ్‌-19 కారణంగా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటామన్న వార్తలు సూచీలను మరింత పతనం దిశగా నడిపించాయి.

లాభాల్లో..

హెచ్​ఎస్​సీఎల్​, ఇన్ఫీబీమ్​, కేఆర్​బీఎల్​, సుప్రజిత్, బజాజ్​ ఆటో​ షేర్లు లాభాలతో ముగించాయి.

నష్టాల్లో...

కొటక్​ బ్యాంక్​ షేర్లు దాదాపు 10 శాతం నష్టపోయాయి. ఎమ్​ అండ్​ ఎమ్​, హెచ్​సీఎల్​టెక్​, జిందాస్టీల్​ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

Last Updated : Apr 1, 2020, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.