ETV Bharat / business

కొనసాగిన బుల్​ జోరు- లాభాల్లో ముగిసిన మార్కెట్లు

author img

By

Published : Aug 16, 2021, 3:36 PM IST

సోమవారం నాడు సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex today) 145 పాయింట్లు పుంజుకుని.. నూతన గరిష్ఠమైన 55,582 వద్ద నిలిచింది. నిఫ్టీ (Nifty today) 34 పాయింట్ల లాభంతో.. 16,563 వద్ద ముగిసింది.

Sensex, Nifty closed edge higher
స్టాక్ మార్కెట్​

సోమవారం సెషన్​లో సూచీలు లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 145 పాయింట్లు పెరిగి 55,582 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 34 పాయింట్ల లాభంతో 16,563 వద్ద ముగిసింది.

డెల్టా వేరియంట్‌ భయాలు, అఫ్గానిస్థాన్‌లో పౌర ప్రభుత్వం కూలడం లాంటి అంశాలు అంతర్జాతీయంగా ఆందోళనలు కలిగించినా.. దేశీయ సూచీలు లాభాలు గడించాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 55,487 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 55,281 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 16,585 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 16,480 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టాటా స్టీల్​,బజాజ్​ ఫినాన్స్​, మహీంద్ర అండ్​ మహీంద్ర, బజాజ్​ ఫిన్​సర్వ్​, హెచ్​డీఎఫ్​సీ,హిందుస్థాన్​ యూనిలివర్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, సన్​ఫార్మా షేర్లు ప్రధానంగా లాభాలను గడించాయి.

మారుతీ, బజాజ్​ ఆటో, పవర్​గ్రిడ్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఎస్​బీఐ, టెక్​ మహీంద్ర, ఎల్​ అండ్​ టీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చదవండి: పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్నారా? ఇవన్నీ అపోహలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.