ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు లాభాలు- సెన్సెక్స్@ 55,555

author img

By

Published : Aug 23, 2021, 3:45 PM IST

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 226 పాయింట్లు పెరిగి.. 55,550 మార్క్ దాటింది. నిఫ్టీ (Nifty Today) 46 పాయింట్లు బలపడి.. 15,500 మార్క్​కు చేరువైంది.

stocks close with profits
స్టాక్ మార్కెట్లకు లాభాలు

స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. సోమవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 226 పాయింట్లు పెరిగి 55,555 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 46 పాయింట్ల లాభంతో 16,496 వద్ద ముగిసింది.

ఈ సెషన్​లో కూడా ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. ఐటీ సహా వివిధ రంగాల్లోని హెవీ వెయిట్​ షేర్ల అండతో లాభాలను సాధించగలిగాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించడం, ఆర్థిక వ్యవస్థపై ఆశాభావ అంచనాలు సూచీలను ముందుకు నడిపించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 55,781 పాయింట్ల అత్యధిక స్థాయి, 55,240 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 16,592 పాయింట్ల గరిష్ఠ స్థాయి 16,395 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​సీఎల్​టెక్, టీసీఎస్, బజాజ్ ఫిన్​సర్వ్​, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాలను గడించాయి.

ఎం&ఎం, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్​గ్రిడ్, ఐటీసీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.

ఇదీ చదవండి: వొడా-ఐడియాకు 43 లక్షల యూజర్లు గుడ్​బై- జియోకు జై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.