ETV Bharat / business

Stock Market: సెన్సెక్స్​ కొత్త రికార్డ్- తొలిసారి 56వేల పైన...

author img

By

Published : Aug 27, 2021, 3:48 PM IST

Updated : Aug 27, 2021, 6:20 PM IST

శుక్రవారం స్టాక్​ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex today) 176 పాయింట్లు పుంజుకుని.. 56,125 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 68 పాయింట్ల లాభంతో.. 16,705 వద్ద ముగిసింది.

Stock Market
మార్కెట్​ అప్​డేట్స్​

వారాంతపు సెషన్​ను సూచీలు లాభాలతో ముగించాయి. టీసీఎస్​, ఎల్​ అండ్​ టీ, ఎచ్​డీఎఫ్​సీ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గుచూపిన వేళ దేశీయ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. గత సెషన్‌లో 5 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్... శుక్రవారం 176 పాయింట్ల వృద్ధితో తొలిసారి 56వేల బెంచ్‌మార్క్‌ ఎగువన ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సూచీ-నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 16వేల 705 పాయింట్ల సరికొత్త గరిష్ఠస్థాయి వద్ద స్థిరపడింది. మెటల్​, ఫార్మా షేర్లు జోరు కొనసాగించాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 56,188 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 55,676 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 16,722 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 16,565 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

అల్ట్రాటెక్​ సిమెంట్​, ఎల్​ అండ్​ టీ, డాక్టర్​ రెడ్టీస్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, సన్​ఫార్మా, టీసీఎస్​, కోటక్​ మహీంద్ర, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు ప్రధానంగా లాభాలను గడించాయి.

ఇన్ఫోసిస్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, మహీంద్ర అండ్​ మహీంద్ర, టెక్​ మహీంద్ర, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

Last Updated :Aug 27, 2021, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.