ETV Bharat / business

వారాంతంలో నష్టాలు- సెన్సెక్స్ 120 పాయింట్లు డౌన్

author img

By

Published : Oct 30, 2020, 3:42 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ సెన్సెక్స్ 136, నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయాయి.

stocks closing
స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 136 పాయింట్లు క్షీణించి 39,614 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 11,642 పాయింట్లకు చేరింది.

ఇంట్రాడేలో దేశీయ సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఉదయం ఫ్లాట్​గా ప్రారంభమైన సూచీలు... మధ్యాహ్నం సెషన్​లో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. విద్యుత్, లోహరంగ షేర్లు రాణించగా.. వాహన, బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టపోయాయి.

లాభనష్టాల్లో...

టాటా స్టీల్, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, నెస్లే, రిలయన్స్, టీసీఎస్​ షేర్లు రాణించాయి.

భారతి ఎయిర్​టెల్​, మారుతి, హిందుస్థాన్​ యూనిలీవర్, బజాజ్​ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోయాయి.

ఇదీ చూడండి: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడా? ఇవి తెలుసుకోండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.