ETV Bharat / business

మార్కెట్లకు లాభాలు- 11,500 పాయింట్ల ఎగువకు నిఫ్టీ

author img

By

Published : Sep 15, 2020, 3:37 PM IST

Updated : Sep 15, 2020, 5:37 PM IST

stocks close
స్టాక్ మార్కెట్లు

బ్యాంకింగ్, ఫార్మా రంగాల షేర్ల దూకుడుతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 288, నిఫ్టీ 82 పాయింట్ల బలపడ్డాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 288 పాయింట్లు బలపడి 39,044 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 82 పాయింట్లు మెరుగై 11,522 పాయింట్లకు చేరుకుంది.

stocks close
మార్కెట్ ముఖ్యాంశాలు

లాభనష్టాల్లో..

ఇండస్​ఇండ్​ బ్యాంక్, సన్​ఫార్మా, బజాజ్​ ఫైనాన్స్, భారతి ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్​ రాణించాయి.

టైటాన్, మారుతి, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్​, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు వెనకబడ్డాయి.

ఆసియా మార్కెట్లు..

ఆసియాలో షాంఘై, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా మార్కెట్లు లాభపడగా.. జపాన్ సూచీలు నష్టాలతో ముగిశాయి.

రూపాయి మారకం..

అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి మారకం విలువ 16 పైసలు బలహీనపడి డాలరుతో పోలిస్తే 73.64 వద్ద స్థిరపడింది.

చమురు

బ్రెంట్ చమురు ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్​కు 39.72 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇదీ చూడండి: 2020-21లో భారత వృద్ధి రేటు -9శాతం నమోదు!

Last Updated :Sep 15, 2020, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.