Gold Rate Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Sep 13, 2021, 9:33 AM IST

gold rate today

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. మరోవైపు.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) స్థిరంగా ఉన్నాయి.

బంగారం ధర(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే సోమవారం స్వల్పంగా పెరిగింది. వెండి (Silver price today) ధర రూ.172 వరకు దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.110 వరకు పెరిగి రూ.48,530కు చేరింది. కేజీ వెండి ధర రూ.64,952వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,530గా ఉంది. కిలో వెండి ధర రూ.64,952 వద్ద ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.48,530గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,952గా కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1792.85 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఔన్సు స్పాట్ వెండి ధర 23.77 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.7 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.2 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ లీటర్​పై రూ.98.43 వద్దకు చేరింది.

ఇదీ చూడండి: జొమాటో నుంచి ఆ సేవలు బంద్​- ఈ నెల 16 లాస్ట్​ డేట్​

ఇదీ చూడండి: అంతా రెడీ.. విప్రో ఉద్యోగులు ఇక ఆఫీస్​కే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.