ETV Bharat / business

పెరిగిన టోకు ద్రవ్యోల్బణం- ఫిబ్రవరిలో 4.17%

author img

By

Published : Mar 15, 2021, 1:25 PM IST

WPI inflation rise in February
ఫిబ్రవరిలో టోకు మరింత పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

ఫిబ్రవరిలో టోకు ధరల ద్రవ్యోల్బణం జనవరితో పోలిస్తే 2 శాతానికిపైగా పెరిగి.. 4.17 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాలు, ఇంధన ధరల్లో వృద్ధి ఇందుకు ప్రధాన కారణం.

హోల్​ సేల్ ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) ఫిబ్రవరిలో భారీగా పెరిగింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.17 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 2.03 శాతంగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ 2.26 శాతంగా ఉండటం గమనార్హం.

ఆహార పదార్థాల ధరలు గత నెల (జనవరితో పోలిస్తే) -2.80 శాతం నుంచి.. 1.36 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో కూరగాయల ధరలు ఏకంగా -20.82 శాతం నుంచి.. 2.90 శాతానికి పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

పప్పుధాన్యాల టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 10.25 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 9.48 శాతంగా ఉంది. ఇంధన, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం గత నెల 0.58 శాతంగా నమోదైంది.

ఇదీ చదవండి:పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం- ఐఐపీ నేల చూపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.