ETV Bharat / business

అక్టోబర్​లో 8నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

author img

By

Published : Nov 16, 2020, 1:26 PM IST

Updated : Nov 16, 2020, 3:52 PM IST

అక్టోబర్​లో టోకు ద్రవ్యోల్బణం 8 నెలల గరిష్ఠం వద్ద 1.48 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో టోకు ద్రవ్యోల్బణం సున్నాగా ఉండటం గమనార్హం. తయారీ రంగంలో పెరిగిన ధరలు టోకు ద్రవ్యోల్బణం వృద్ధికి కారణమైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

WPI inflation in October
ఎనిమిది నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) అక్టోబర్​లో భారీగా పెరిగింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. 0 శాతం నుంచి 1.48 శాతానికి పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఇది దాదాపు 8 నెలల గరిష్ఠానికి సమానం.

టోకు ద్రవ్యోల్బణం ఈ ఏడాది సెప్టెంబర్​లో 1.32 శాతంగా నమోదైంది.

ఆహార టోకు ద్రవ్యోల్బణం​ మాత్రం అక్టోబర్​లో 6.37 శాతానికి తగ్గింది. ఇది సెప్టెంబర్​లో 8.17 శాతంగా ఉంది.

తయారీ రంగ టోకు ద్రవ్యోల్బణం సెప్టెంబర్​తో పోలిస్తే..1.61 శాతం నుంచి 2.12 శాతానికి పెరిగింది.

కూరగాయలు, బంగాళదుంపల టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్​లో 25.23 శాతం, 107.70 శాతంగా ఉన్నాయి.

ఆహారేతర ఫుడ్ ఆర్టికల్స్​, మిరల్స్​ల టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్​లో 2.85 శాతం, 9.11 శాతంగా నమోదయ్యాయి.

ఇంధన, విద్యుత్ ధరల టోకు ద్రవ్యోల్బణం మాత్రం గత నెల -10.95 శాతంగా నమోదవడం గమనార్హం.

ఇదీ చూడండి:'అంచనాలకన్నా వేగంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ'

Last Updated :Nov 16, 2020, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.