ETV Bharat / business

మూడోరోజూ పెరిగిన పెట్రో ధరలు

author img

By

Published : Nov 22, 2020, 11:57 AM IST

Petrol, diesel prices rise for third straight day
వరుసగా మూడోరోజూ పెరిగిన పెట్రో ధరలు

పెట్రోల్, డీజిల్​ ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో ఆదివారం పెట్రోల్​పై 8 పైసలు, డీజీల్​పై 19 పైసలు చొప్పున ధర పెరిగింది.

పెట్రోల్, డీజిల్​ ధరలు వరుసగా మూడోజూ పెరిగాయి. దిల్లీలో డీజిల్​పై లీటరుకు 19 పైసలు, పెట్రోల్​పై 8 పైసలు చొప్పున ధర పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.81.46కు, డీజిల్​ ధర రూ.71.07కు చేరింది.

శుక్రవారం నుంచి పెట్రో ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ మూడురోజుల్లో పెట్రోల్​పై ధర 40 పైసలు పెరగగా.. డీజిల్​పై 61 పైసలు పెరిగింది.

అంతర్జాతీయ ధరలకు తగ్గట్టుగా మార్పులు చేసినట్లు వివిధ చమురు సంస్థలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక అమ్మకాల పన్నుల ప్రకారం ఈ ధరల్లో తేడా ఉండనుంది.

ఇదీ చూడండి:ఉగ్రవాద నిర్మూలనకు కలిసిరావాలి: ఉపరాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.