స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. మిడ్ సెషన్ వరకు నమోదైన లాభాలతో సూచీలు కొత్త శిఖరాలను తాకాయి. చివరి గంటలో లాభాల స్వీకరణ కారణంగా తాజా గరిష్ఠాల నుంచి వెనక్కి తగ్గాయి. అంతర్జాతీయంగా మిశ్రమ పవనాలూ నేటి నష్టాలకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 68 పాయింట్లు కోల్పోయింది.. చివరకు 40,821 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో..12,038 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,120 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. 40,710 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,132 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం).. 12,006 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఐసీఐసీఐ బ్యాంకు 2.62 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.46 శాతం, టాటా స్టీల్ 1.17 శాతం, ఐటీసీ 0.52 శాతం, హెచ్డీఎఫ్సీ 0.44 శాతం, హీరో మోటార్స్ 0.36 శాతం లాభాలను నమోదు చేశాయి.
భారతీ ఎయిర్టెల్ 4.34 శాతం, పవర్ గ్రిడ్ 2.26 శాతం, సన్ఫార్మా 1.75 శాతం, ఎం&ఎం 1.67 శాతం, టీసీఎస్ 1.60 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: భారత్లో 'ఐఫోన్ ఎక్స్ఆర్' మొబైల్ తయారీ షురూ!