ETV Bharat / business

జువెలరీ రంగానికి బూస్ట్​.. దిగుమతి సుంకం తగ్గింపు

author img

By

Published : Feb 1, 2022, 2:07 PM IST

Updated : Feb 1, 2022, 4:05 PM IST

జువెలరీ రంగానికి ఊతం ఇచ్చేందుకు వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని 5శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంటులో బడ్జెట్​ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

jewellery sector
జ్యువెలరీ రంగానికి బూస్ట్​.. దిగుమతి సుంకం తగ్గింపు

బడ్జెట్​లో జువెలరీ రంగానికి బూస్ట్​ ఇచ్చింది కేంద్రం. పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. పాలిష్ చేయని వజ్రాలకు ఎలాంటి దిగుమతి సుంకం ఉండదని చెప్పింది. ఈమేరకు పార్లమెంటులో బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. అలాగే జువెలరీ ఎగుమతి కోసం ఈ కామర్స్​ సదుపాయాన్ని కూడా తీసుకొస్తామని తెలిపారు.

అలాగే అధిక ధర కారణంగా కొన్ని స్టీల్ ఉత్పత్తులపై నిర్దిష్ట యాంటీ-డంపింగ్ సుంకం, CVD రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మిథనాల్‌తో సహా కొన్ని రసాయనాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించాలని ప్రతిపాదించారు.

పెట్రోలు, డీజిల్‌లో జీవ ఇంధనాలను కలపడాన్ని ప్రోత్సహించడానికి అక్టోబర్ 1 నుంచి అన్​బ్లండెడ్​ ఫ్యూయల్స్​పై లీటర్​కు రూ.2 అదనపు ఎక్సైజ్ సుంకం వసూలు చేయనున్నట్లు నిర్మల పేర్కొన్నారు.

Last Updated : Feb 1, 2022, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.