ETV Bharat / business

చమురు మంటకు తోడు కొవిడ్ దెబ్బ- సెన్సెక్స్ 656 డౌన్

author img

By

Published : Jan 19, 2022, 3:36 PM IST

Stock market news: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల వరుసగా రెండో రోజూ భారీ నష్టాలను చవిచూశాయి స్టాక్​ మార్కెట్లు. సెన్సెక్స్​ 656 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 175 పాయింట్లు పతనమైంది.

stock-market-news
స్టాక్ మార్కెట్​ న్యూస్​

Stock market news: స్టాక్​ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ముడి చమురు ధరలు పెరగడం, దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం వంటి కారణాల మదుపర్లను ప్రభావితం చేశాయి. ఫలితంగా బీఎస్​ఈ సెన్సెక్స్​ 656 పాయింట్లు కోల్పోయి 60,099కి పడిపోయింది. నిఫ్టీ 175 పాయింట్ల నష్టంతో 17,938 వద్ద స్థిరపడింది.

ఓఎన్​జీసీ, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఎస్​బీఐ, హిండాల్కో షేర్లు లాభాలను ఆర్జించాయి.

ఏషియన్​ పెయింట్స్​, బజాజ్​ ఫినాన్స్​, ఇన్ఫోసిస్​, హిందుస్థాన్​ యూనిలివర్,​ విప్రో షేర్లు నష్టాలను చవిచూశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.