ETV Bharat / business

బ్యాంకింగ్ రంగం జోరుతో మార్కెట్లలో లాభాల హోరు

author img

By

Published : Mar 26, 2020, 10:36 AM IST

stocks news
స్టాక్ మార్కెట్‌ వార్తలు

స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,330 పాయింట్లకు పైగా లాభంతో తిరిగి 30 వేల స్థాయికి చేరువైంది. నిఫ్టీ దాదాపు 340 పాయింట్ల వృద్ధితో ట్రేడవుతోంది.

ఆర్థిక ప్యాకేజీపై ఆశలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 1,330 పాయింట్లకుపైగా లాభంతో 29,865 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ దాదాపు 340 పాయింట్ల వృద్ధితో.. 8,656 వద్ద ట్రేడవుతోంది.

లాభాలకు కారణాలు

కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో కొనసాగుతోంది. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడకుండా కేంద్రం ఆర్థిక ప్యాకేజీ తీసుకురానుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించనున్నారు. ఈ సానుకూలతలు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 25 శాతానికిపైగా లాభంతో ట్రేడవుతోంది. బజాజ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.

30 షేర్ల ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ మాత్రమే స్వల్ప నష్టాల్లో ఉంది.

ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు.. షాంఘై, సియోల్, హాంకాంగ్, టోక్యో సూచీలు నేడు మిశ్రమంగా కొనసాగుతున్నాయి.

రూపాయి, ముడిచమురుర..

రూపాయి కూడా నేడు సానుకూలంగా కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 13 పైసలు బలపడి 75.81 వద్ద ఉంది.

ముడిచమురు ధరల సూచీ-బ్రెంట్‌ 0.51 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 27.25 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:కరోనా నుంచి త్వరగానే కోలుకుంటాం: నాదెళ్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.