రిలయన్స్​ చేతికి ఆర్​ఈసీ సోలార్- రూ.5,800 కోట్ల డీల్​

author img

By

Published : Oct 10, 2021, 7:01 PM IST

RIL buys REC solar company
సోలార్​ ఎనర్జీ కంపెనీ కొన్న రిలయన్స్ ()

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్​ లిమిటెడ్​ వ్యాపార కార్యకలాపాలు చరుగ్గా సాగుతున్నాయి. ఇటీవలే హరిత ఇంధన మార్కెట్​లోకి ప్రవేశించిన ఈ సంస్థ.. తొలిసారి మరో కంపెనీని కొనుగోలు చేసింది. నార్వే, సింగపూర్​ కేంద్రాలుగా పని చేస్తున్న ఆర్​ఈసీ సోలార్ అనే సంస్థను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్​ లిమిటెడ్​ (ఆర్​ఎన్​ఈఎస్​ఎల్​) పేరుతో .. ఇటీవలే హరిత ఇంధన వ్యాపారంలోకి ప్రవేశించిన రిలయన్స్ ఇండస్ట్రీస్​.. ఆ రంగంలో ఓ కంపెనీని కొనుగోలు చేసింది. ఆర్​ఈసీ సోలార్​ అనే విద్యుత్ కంపెనీని 771 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.5,800 కోట్లు) స్వాధీనం చేసుకుంది. ఆర్​ఈసీ సోలార్​లో 100 శాతం వాటాను దక్కించుకున్నట్లు ఆర్​ఎస్​ఈఎస్​ఎల్​ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ సంస్థ చైనా నేషనల్ బ్లాస్టర్​ గ్రూప్​ అధీనంలో ఉండేది. రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్​ లిమిటెడ్​ కొనుగోలు చేసిన తొలి సంస్థ ఆర్​ఈసీ సోలార్​ కావడం గమనార్హం.

ఆర్​ఈసీ ప్రధాన కార్యాలయం నార్వేలో ఉంది. ఆపరేషనల్ హెడ్​క్వార్టర్​ సింగపూర్​లో ఉండగా.. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా పసిఫిక్​ ప్రాంతాల్లో రీజినల్ హబ్​లు ఉన్నాయి.

ఆర్ఈసీ కంపెనీ గురించి..

ఆర్​ఈసీ గ్రూప్ అంతర్జాతీయంగా గుర్తింపు పొంది సోలార్ ఎనర్జీ కంపెనీ. సాంకేతిక ఆవిష్కరణలు, ఉన్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన సోలార్​ సెల్స్, సోలార్​ ప్యానెల్స్​ను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంటుంది. 25 ఏళ్లుగా ఈ సంస్థ ఈ వ్యాపారాలను సాగిస్తోంది.

ఆర్ఈసీకి నార్వేలో.. సోలార్​ గ్రేడ్​ పాలీసిలికాన్​ ప్యానెల్స్ తయారు చేసే రెండు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. పీవీ సెల్స్​, మాడ్యూల్స్ ఉత్పత్తి ప్లాంట్ సింగపూర్​లో ఉంది.

ఇదీ చదవండి: '2030 నాటికి 100 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.