ETV Bharat / business

'నవ భారత్​కు వెన్నెముకగా అంకుర సంస్థలు'

author img

By

Published : Jan 15, 2022, 1:47 PM IST

PM modi
ప్రధాని మోదీ

PM Modi On Startups: నవ భారత్​కు వెన్నెముకగా అంకుర సంస్థలు ఉంటాయని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం భారత్​ ఎదుర్కొంటున్న సమస్యలకు సృజన, సాంకేతికతపరమైన పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నించాలని సూచించారు.

PM Modi On Startups: నవ భారత్​కు వెన్నెముకగా అంకుర సంస్థలు ఉంటాయని అభిప్రాయపడ్డారు ప్రధాని నరేంద్రమోదీ. భారత్​లో, భారత్​ కోసం సరికొత్త ఆవిష్కరణలు చేయాలని యువతకు పిలుపునిచ్చారు.

ప్రస్తుతం దేశంలో 60వేలకు పైగా స్టార్ట్​అప్​ సంస్థలు, 42 యూనికార్న్​ కంపెనీలు ఉన్నాయన్నారు. భారత్​ ఎదుర్కొంటున్న సమస్యలకు సృజన, సాంకేతికతపరమైన పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇన్నోవేషన్​, వ్యవస్థాపకత, స్టార్ట్అప్ ఎకోసిస్టమ్​.. లాంటి మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు మోదీ.

"గతేడాది 28వేల పేటెంట్స్ మంజూరు చేశాం. 2013-14లో 4వేల పేటెంట్స్ మాత్రమే మంజూరు అయ్యాయి. 2013-14లో 70వేల ట్రేడ్ మార్కులు రిజిస్ట్రేషన్ కాగా.. 2020-21లో 2.5లక్షల ట్రేడ్​మార్క్​లు రిజిస్ట్రేషన్​లు జరిగాయి. అంతేగాక గ్లోబల్ ఇన్నోవేషన్​ ఇండెక్స్​లో భారత్ 46వ స్థానంలో కొనసాగుతోంది. 2015లో 81 స్థానంలో ఉంది."

-- ప్రధాని నరేంద్ర మోదీ

అంకుర సంస్థలు నూతన ఆవిష్కరణలకు మాత్రమే పరిమితం కావడం లేదని.. వాటివల్ల ఉద్యోగ కల్పన కూడా జరుగుతోందన్నారు ప్రధాని మోదీ.

అంకుర సంస్థల ప్రాముఖ్యాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ఏటా జనవరి 16న నేషనల్ స్టార్ట్​అప్ డేను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు మోదీ.

ఇదీ చూడండి: ఘనంగా సైనిక దినోత్సవం- అమరులకు త్రివిధ దళాల సలాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.