ETV Bharat / business

భారత​ కుబేరుల్లో అగ్రస్థానంలో అంబానీ!

author img

By

Published : Mar 28, 2021, 5:36 PM IST

Mukesh Ambani once again tops the list of india's richest people
భారత్​ కుబేరుల్లో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

ఓ నివేదిక ప్రకారం దేశంలో కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్​ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్స్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ జాబితాలో జిందాల్​ స్టీల్​ అధినేత్రి సావిత్రి జిందాల్​ ఏకైక మహిళ కాగా.. ఆమె పదో స్థానానికి పరిమితమయ్యారు.

భారత్​లోని అత్యంత ధనవంతుల్లో రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఓ నివేదిక గణాంకాల ప్రకారం అంబానీ మొత్తం సంపద 77.8 బిలియన్​ డాలర్లు. ఇదే జాబితాలో అదానీ సంస్థల ఛైర్మన్​ గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 53.8 బిలియన్ డాలర్లు.

జాబితాలోని ఇతర కుబేరులు..

  • శివ్​ నాడార్(హెచ్​సీఎల్​ టెక్నాలజీస్)​ 24 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు.
  • ఆర్సెలార్​ మిత్తల్​ సీఈఓ లక్ష్మీ నివాస్​ మిత్తల్​ 16.8 బిలియన్ డాలర్ల సంపదతో నాల్గో స్థానంలో ఉన్నారు.
  • కోటక్​ మహీంద్ర బ్యాంక్​ వ్యవస్థాపకుడు ఉదయ్​ కోటక్​ ఈ జాబితాలో 5వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈయన సంపద 15 బిలియన్​ డాలర్లు.
  • ఆదిత్య బిర్లా గ్రూప్​ ఛైర్మన్​ కుమార్​ బిర్లా 12.8 బిలియన్ డాలర్ల సంపదతో ఆరో స్థానంలో నిలిచారు.
  • పూనావాల్ గ్రూప్​ ఛైర్మన్​ సైరస్​ పూనావాలా ఈ జాబితోలో 7వ స్థానంలో ఉన్నారు. ఈయన ఆస్తి నికర విలువ 12.8 బిలియన్ డాలర్లు.
  • సన్​ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్​ సంఘ్వీ(10.5 బిలియన్​ డాలర్లు)​, భారతీ ఎంటర్​ప్రైజెస్​ అధినేత సునీల్​ మిత్తల్​(10.4 బిలియన్ డాలర్లు)​లు వరుసగా 8,9 స్థానాల్లో నిలిచారు.
  • జిందాల్ స్టీల్​ అధినేత్రి సావిత్రీ జిందాల్​ ఈ జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆమె సంపద 10.2 బిలియన్ డాలర్లుగా అంచనా. టాప్​ 10 కుబేరుల్లో సావిత్రి జిందాల్​ ఒక్కరే మహిళ కావడం గమనార్హం.

ఇదీ చూడండి: కరోనాలోనూ కేఎఫ్​సీ విస్తరణ- కొత్తగా 30 రెస్టారెంట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.