ETV Bharat / business

పెరిగిన మారుతీ కార్ల ధరలు- ఏ మోడల్​పై ఎంతంటే?

author img

By

Published : Sep 6, 2021, 12:08 PM IST

Updated : Sep 6, 2021, 7:12 PM IST

ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ కార్లు (Maruti Suzuki Price Hike) మరింత ప్రియమయ్యాయి. వివిధ మోడళ్లపై పెరిగిన ధరలు సోమవారం అమలులోకి వచ్చాయి. కొత్త ధరల వివరాలు (Maruti Suzuki new price) ఇలా ఉన్నాయి.

Maruti Suzuki
మారుతీ సుజుకీ

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. కార్ల ధ‌ర‌ల‌ను (Maruti Suzuki Price Hike) మరోసారి పెంచింది. ఆగస్టు 30నే ఈ విషయాన్ని ప్రకటించిన మారుతీ.. తాజాగా పెంచిన ధరలు సోమవారం (సెప్టెంబర్ 6,2021) అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

తయారీ, నిర్వహణ, ముడిసరకుల వంటి ఇన్‌పుట్ వ్యయాలు పెరగటం కార‌ణంగా.. వినియోగదారులపై ధరల పెంపు రూపంలో భారాన్ని మోపక తప్పడం లేదని మారుతీ సుజుకీ వివరించింది.

ఎంత పెరిగిందంటే...

సెలెరియో మినహా మిగతా అన్ని మోడళ్లపై సగటున 1.9 శాతం వరకు ధరలు (దిల్లీ ఎక్స్​ షోరూం) పెరిగినట్లు (Maruti Suzuki new price) కంపెనీ ప్రకటించింది.

ఈ ఏడాది ఇప్పటికే పలు మార్లు ధరలు పెంచింది మారుతీ సుజుకీ. జులైలో హ్యాచ్​ బ్యాక్​ సెగ్మెంట్​లోని స్విఫ్ట్​ సహా.. అన్ని సీఎన్​జీ మోడళ్ల ధరలను (దిల్లీ ఎక్స్ షోరూం) రూ.15,000 వరకు పెంచింది. ఏప్రిల్​ 16న మోడళ్ల వారీగా.. సగటు ధర 1.6 శాతం ధర పెరిగింది. జనవరి 18న ఎంపిక చేసిన మోడళ్లపై రూ.34 వేల వరకు ధర పెంచింది కంపెనీ.

మారుతీ సుజుకీ ప్రస్తుతం ఎంట్రీ లెవెల్​ హ్యాచ్​బ్యాక్​ సెగ్మెంట్​లో​ ఆల్టో నుంచి ఎస్​-క్రాస్ మోడళ్లను.. ​రూ.2.99 లక్షల నుంచి రూ.12.39 లక్షల (దిల్లీ ఎక్స్​షోరూం) ధరల స్థాయిలో విక్రయిస్తోంది.

ఇదీ చదవండి: '75 ఏళ్లు దాటిన వారికి ఐటీ రిటర్నులు అక్కర్లేదు'

Last Updated :Sep 6, 2021, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.