Stock market today: వైరస్​ ఎఫెక్ట్- మార్కెట్లకు భారీ నష్టాలు

author img

By

Published : Nov 26, 2021, 10:56 AM IST

Updated : Nov 26, 2021, 3:44 PM IST

Market LIVE Updates

కరోనా భయాలు మళ్లీ స్టాక్​ మార్కెట్లను (Stock market today) కుదిపేశాయి. దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 1300 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల మేర నష్టపోయాయి. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్​ బయటపడిన నేపథ్యంలో.. ఆసియా సహా ప్రపంచ దేశాల స్టాక్​ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్నాయి.

స్టాక్​ మార్కెట్లు (Stock market today India) వారాంతంలో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 1300 పాయింట్లకుపైగా నష్టపోయింది. ప్రస్తుతం 57 వేల 430 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 400 పాయింట్లు పతనమై.. ప్రస్తుతం 17 వేల 120 వద్ద ఉంది.

లాభనష్టాల్లో..

ఫార్మా రంగం (Stock market news) షేర్లు మాత్రమే కొన్ని లాభాల్లో ఉన్నాయి.

బ్యాంకింగ్​ షేర్లు కుదేలయ్యాయి.

సెన్సెక్స్​ 30 ప్యాక్​లో డాక్టర్​ రెడ్డీస్​ మాత్రమే రాణిస్తోంది. బజాజ్​ ఫినాన్స్​, టైటాన్​, టాటా స్టీల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, మారుతీ సుజుకీ, ఎం అండ్​ ఎం అన్నీ 3 శాతానికిపైగా నష్టపోయాయి.

కారణాలివే..

దక్షిణాఫ్రికాలో (Corona variant south africa) గురువారం.. కరోనా కొత్త వేరియంట్​ బయటపడింది. ఇది ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేసింది.

ఈ నేపథ్యంలోనే స్టాక్​ సూచీలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

కొవిడ్​ కేసులు పెరుగుతున్న తరుణంలో.. ఐరోపా సమాఖ్య దేశాలు చాలావరకు పూర్తి స్థాయి లాక్​డౌన్​ విధించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఫలితంగా.. మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భయంతో.. తమ షేర్లను భారీ స్థాయిలో విక్రయిస్తున్నారు. ఇది మార్కెట్ల నష్టాలకు ఓ కారణం.

భారత్​లో ప్రస్తుతానికి కరోనా భయాలు పెద్దగా లేవు. కేసులు కనిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. అయినప్పటికీ.. ప్రపంచ మార్కెట్ల ప్రభావం దేశీయ సూచీలపై స్పష్టంగా కనిపిస్తోంది.

ఇదీ చూడండి: ఏడీబీ నుంచి భారత్​ 3 బిలియన్​ డాలర్ల రుణం.. ఎందుకంటే?

Last Updated :Nov 26, 2021, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.