ఏడీబీ నుంచి భారత్​ 3 బిలియన్​ డాలర్ల రుణం.. ఎందుకంటే?

author img

By

Published : Nov 24, 2021, 10:49 PM IST

ADB

ADB Loan To India: ఆసియా డెవెలప్​మెంట్​ బ్యాంక్​ నుంచి కేంద్ర ప్రభుత్వం సుమారు 300 బిలియన్​ డాలర్లను రుణంగా తీసుకోనుంది. దీనిని దేశంలోని పట్టణ ప్రాంతంలో ఉండే వారి ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు ఖర్చు చేయనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి.

ADB Loan To India: భారత్​లోని 13 రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్యరంగానికి పెద్దపీట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం, ఆసియా డెవెలప్​మెంట్​ బ్యాంక్​ నుంచి సుమారు 300 బిలియన్​ డాలర్లు రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 13 రాష్ట్రాల్లోని వివిధ పట్టణ ప్రాంతాల్లోని 51 లక్షల మురికివాడల్లో నివసించే సుమారు 2 కోట్ల 56 లక్ష మంది లబ్ధిపొందనున్నారు. ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి రజాత్​ కుమార్​ మిశ్రా భారత్​ నుంచి, ఏడీబీ నుంచి టాకియో కొనిషిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ రుణం పట్టణ ప్రాంతాల్లో ఉండే జనాభాకు మెరుగైన వైద్యసేవలను అందించడానికి ఉపయోగపడుతుందని మిశ్రా అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్​ భారత్​ హెల్త్​ అండ్​ వెల్​నెస్​ సెంటర్స్​, ప్రధానమంత్రి ఆత్మనిర్భర భారత్ యోజన, ప్రధానమంత్రి ఆయుష్మాన్​ భారత్​ హెల్త్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ మిషన్​ లాంటి కార్యక్రమాలకు ఈ మొత్తం దన్నుగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: Star Health IPO: స్టార్​హెల్త్​ ఐపీఓ తేదీ ఖరారు- వివరాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.