ETV Bharat / business

నేడో, రేపో భారత్​కు మాల్యా.. నేరుగా కోర్టుకే!

author img

By

Published : Jun 4, 2020, 1:53 PM IST

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి.. యూకేలో తలదాచుకున్న విజయ్​ మాల్యాను అతి త్వరలో భారత్​కు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే న్యాయపరమైన ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. వచ్చిన వెంటనే నేరుగా ఆయనను కోర్టుకే తరలించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Mallya to be flown, lodged in Mumbai on extradition
నేడో, రేపో భారత్​కు మాల్యా.. నేరుగా కోర్టుకే!

ఎప్పటినుంచో పరారీలో ఉన్న రుణ ఎగవేతదారు విజయ్​ మాల్యాను.. బ్రిటన్​ అతిత్వరలో భారత్​కు అప్పగించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నేరుగా ఆయనను ముంబయికి తరలించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) అధికారులు ఆయన వెంట ఉండనున్నారు.

ముంబయి విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజే భారత్​కు వస్తే ఆయనను రాత్రి ముంబయిలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే ఉంచుతారు. ఆ తర్వాత కోర్టు ముందు ప్రవేశపెడతారు.

ఒకవేళ.. విజయ్​ మాల్యా భారత్​కు శుక్రవారం వస్తే.. నేరుగా కోర్టుకే తరలించనున్నారు. సీబీఐ, ఈడీ కస్టడీలోకి తీసుకోవాలని చూస్తున్నాయి.

మే 14నే కోర్టులో చుక్కెదురు..

మే 14న బ్రిటన్ హైకోర్టులో.. తనని భారత్​కు అప్పగించకూడదన్న మాల్యా అప్పీలు వీగిపోయిన సమయంలోనే మాల్యాను భారత్​కు తెచ్చే అంశమై మార్గం సుగమమైంది.

2018లో విచారణ సందర్భంగా.. కింగ్​ఫిషర్​ అధినేతను భారత్​కు అప్పగిస్తే ఎక్కడ ఖైదు చేస్తారో వివరాలు సమర్పించాలని కోరింది యూకే కోర్టు. బదులుగా.. అత్యంత భద్రతతో కూడిన ముంబయి ఆర్థర్ రోడ్​ జైల్లో ఉంచుతామని భారత ప్రభుత్వం గతంలోనే లండన్ కోర్టుకు తెలిపింది. గది వీడియోను కోర్టుకు సమర్పించింది.

17 భారతీయ బ్యాంకులకు రూ. 9,000 కోట్ల రుణాలను ఎగవేశారు మాల్యా. ఈ మొత్తంతో 40 విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని అభియోగాలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.