ETV Bharat / business

Crisil Report On LIC: ఎల్‌ఐసీ ఈక్విటీపై 82% ప్రతిఫలం

author img

By

Published : Feb 7, 2022, 8:30 AM IST

LIC 3rd largest globally,
ఎల్‌ఐసీ ఈక్విటీపై 82% ప్రతిఫలం

Crisil Report On LIC: ప్రపంచంలోనే మూడో అతి పెద్ద బీమా సంస్థగా నిలిచిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ), ఈక్విటీపై 82శాతం ప్రతిఫలాన్ని (ఆర్‌ఓఈ) అందిస్తోందని క్రిసిల్‌ నివేదిక వెల్లడించింది. 2000 సంవత్సరానికి ముందు ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా 100 శాతం ఉండగా, 2016కు క్రమంగా తగ్గి 71.8 శాతానికి వచ్చిందని, 2020కి 64.1 శాతానికి దిగిందని నివేదిక తెలిపింది.

Crisil Report On LIC: జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద బీమా సంస్థగా నిలిచిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ), ఈక్విటీపై 82శాతం ప్రతిఫలాన్ని (ఆర్‌ఓఈ) అందిస్తోందని క్రిసిల్‌ నివేదిక వెల్లడించింది. 2000 సంవత్సరానికి ముందు ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా 100 శాతం ఉండగా, 2016కు క్రమంగా తగ్గి 71.8 శాతానికి వచ్చిందని, 2020కి 64.1 శాతానికి దిగిందని నివేదిక తెలిపింది. దేశంలో రెండో అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎస్‌బీఐ లైఫ్‌ మార్కెట్‌ వాటా 2016లో 5 శాతం ఉండగా, 2020కి 8 శాతానికి పెరిగిందని 2021 నవంబరులో తయారు చేసిన నివేదికలో క్రిసిల్‌ వెల్లడించింది. తొలి, రెండో స్థానంలో ఉన్న బీమా సంస్థల మార్కెట్‌ వాటా పరంగా ఇంత తేడా మరే దేశంలోనూ లేదు. ఈ నివేదిక ప్రకారం..

  • 5,640.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.23 లక్షల కోట్లు) స్థూల రిటెన్‌ ప్రీమియంతో (జీడబ్ల్యూపీ) ఎల్‌ఐసీ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది.
  • 2021 మార్చి నాటికి ఈ సంస్థకు 13.5 లక్షల మంది వ్యక్తిగత ఏజెంట్లు ఉన్నారు. దేశంలో ఉన్న మొత్తం ఏజెంట్‌ నెట్‌వర్క్‌లో ఈ సంస్థ వాటానే 55 శాతం కావడం గమనార్హం.
  • చైనా మార్కెట్‌లో పింగ్‌ యాన్‌ ఇన్సూరెన్స్‌, చైనా లైఫ్‌ ఇన్సూరెన్స్‌లు 21 శాతం (7,413 కోట్ల డాలర్లు), 20 శాతంతో (6,965 కోట్ల డాలర్లు) ప్రీమియం వసూళ్లలో ఆధిపత్యం కనబరుస్తున్నాయి. జపాన్‌కు చెందిన నిప్పాన్‌ లైఫ్‌ మార్కెట్‌ వాటా 16.2 శాతంగా (3,984 కోట్ల డాలర్లు) ఉంది.
  • అత్యధిక ఆర్‌ఓఈ అందిస్తున్న సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ఐసీ 82 శాతంతో అగ్ర స్థానంలో ఉంది. పింగ్‌ యాన్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ చైనా 19.5 శాతం, అవివా 14.8 శాతం, చైనా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 11.9 శాతం మాత్రమే అందిస్తున్నాయి.
  • మొత్తం ఆస్తుల పరంగా చూస్తే ఎల్‌ఐసీ 52,200 కోట్ల డాలర్లతో (సుమారు రూ.39.15 లక్షల కోట్లు) అతి పెద్ద ఆరో సంస్థగా ఉంది. పింగ్‌ యాన్‌ (1,38,000 కోట్ల డాలర్లు), మెట్‌లైఫ్‌ (79,515 కోట్ల డాలర్లు), నిప్పాన్‌ లైఫ్‌ (70,500 కోట్ల డాలర్లు), అవివా లైఫ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ (65,734 కోట్ల డాలర్లు), చైనా లైఫ్‌లు (61,630 కోట్ల డాలర్లు) తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.

ఎల్‌ఐసీ బోర్డులోకి ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు

త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు రాబోతున్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) గత నెలలో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకుంది. ఆర్థిక సేవల మాజీ కార్యదర్శి అంజులి చిబ్‌ దుగ్గల్‌, సెబీ మాజీ సభ్యులు జి.మహాలింగం, ఎస్‌బీఐ లైఫ్‌ మాజీ ఎండీ సంజీవ్‌ నౌతియాల్‌, ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఎంపీ విజయ్‌ కుమార్‌, రాజ్‌ కమల్‌, వీఎస్‌ పార్థసారథిలను ఎల్‌ఐసీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీరితో కలిపి మొత్తం స్వతంత్ర డైరెక్టర్ల సంఖ్య 9కి చేరింది. సెబీ వద్ద ఐపీఓ ముసాయిదా పత్రాలు దాఖలు చేయడానికి అవసరమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నిబంధనల మేరకు ఎల్‌ఐసీ ఈ నియామకాలు చేపట్టినట్లు సమాచారం. ఈ వారంలోనే ఎల్‌ఐసీ ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసే అవకాశం ఉందని దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. మార్చిలో స్టాక్‌మార్కెట్లలో ఎల్‌ఐసీని నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఎల్‌ఐసీ ఛైర్మన్‌ ఎం.ఆర్‌.కుమార్‌, ఎండీల్లో ఒకరైన రాజ్‌కుమార్‌ల పదవీ కాలాన్ని కూడా 12 నెలల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి: ఎల్‌ఐసీ పాలసీదారులా..? ఐపీవోలో పాల్గొనాలంటే ఏం చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.