బ్యాంకులు ఇచ్చే రుణాలు రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి బాకీ తీరేవరకు ఒకే వడ్డీ రేట్లు ఉండేది. రెండోది వడ్డీ రేట్లు మారుతూ ఉండేది. నిర్ణీత వడ్డీ రేట్ల రుణాలపై రిజర్వు బ్యాంకు నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదు. రెండో రకం వాటిపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది.
బ్యాంకులు ఇలా నిర్ణయిస్తాయి...
రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు... ఆ ఫలాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని బ్యాంకులను కోరుతుంది. ఇందులో భాగంగా ఆయా బ్యాంకుల అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఇందులో బ్యాంకులు తప్పకుండా వడ్డీ రేట్లను తగ్గించాలన్న నిబంధన ఉండేది కాదు. కానీ అక్టోబర్ 1 నుంచి రిటైల్, చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలను ఎక్స్టర్నల్ బెంచ్ మార్కు ద్వారా అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎక్స్టర్నల్ బెంచ్ మార్కులో ట్రెజరీ బిల్ రేటు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ రేటు, రెపో రేటు వంటివి ఉన్నాయి. బ్యాంకులు వీటి ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయించాల్సి ఉంటుంది. వీటి ద్వారా బ్యాంకు వడ్డీ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు వెంటనే బదిలీ అవుతుంది.
ఇదీ ప్రక్రియ....
ప్రతి బ్యాంకుకు కోర్ బ్యాంకింగ్ బృందాలు లేదా బ్యాంక్ ఎండ్ బృందాలు ఉంటాయి. బ్యాంకులన్నీ డిజిటల్ పద్దతిలో అన్ని లావాదేవీలను నిర్వహిస్తుంటాయి. దానికి అనుగుణంగా సర్వర్లు ఉంటాయి. వీటి ద్వారా బ్యాంకు సెంట్రల్ సర్వర్లో వడ్డీ రేట్లను మార్పు చేస్తారు. దీంతో అటోమేటిక్గా వినియోగదారులకు వడ్డీ రేట్లు తగ్గుతాయి.
వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనం పొందటానికి వినియోగదారుడు బ్యాంకును సంప్రదించాల్సిన అవసరం లేదు. ఒక వేళ వడ్డీ రేట్లలో ఏమైనా సందేహాలు ఉండే బ్యాంకు అధికారులను సంప్రదించి నివృత్తం చేసుకోవచ్చు.బ్యాంకులు వడ్డీ రేట్లు ఎలా తగ్గిస్తాయి...?
ఇదీ చూడండి:చెన్నై విమానాశ్రయంలో జిన్పింగ్కు ఘనస్వాగతం