ETV Bharat / business

ఐఆర్​సీటీసీలో 20% వాటా విక్రయం!

author img

By

Published : Dec 10, 2020, 2:23 PM IST

Govt plans to sell up to 20% stake in IRCTC
ఐఆర్​సీటీసీలో 20% వాటా విక్రయానికి కేంద్రం ప్రణాళికలు

ఐఆర్​సీటీసీలో 20శాతం వాటా అమ్మాలని కేంద్రం ప్రతిపాదించింది. ఒక్కో షేరు ప్రాథమిక ధరను రూ.1,367గా నిర్ణయించింది.

ఐర్​సీటీసీలో 20 శాతం వాటా విక్రయానికి కేంద్రం సన్నద్ధమైంది. 15 శాతం(2.40 కోట్ల షేర్లు) వాటాను ఆఫర్​ ఆఫ్ సేల్​ విధానం(ఓఎఫ్​ఎస్​)లో అమ్మాలని ప్రతిపాదించింది. ఓవర్​ సబ్​స్క్రైబ్​ అయితే మరో 5 శాతం(80లక్షల షేర్లు) వాటాను విక్రయించాలని నిర్ణయించింది.

ప్రాథమిక ధరను ఓక్కో ఈక్విటీ షేర్​కు రూ.1,367 ఖరారు చేసింది. స్టాక్​ ఎక్స్​ఛేంజీల ప్రత్యేక విండో ద్వారా ఈ నెల 10, 11న అమ్మకపు ప్రక్రియ నిర్వహించనున్నారు. అయితే.. డిసెంబర్​ 11న జరిగే బిడ్డింగ్​లో రిటైల్​ పెట్టుబడిదారులకే అనుమతి ఉంటుంది.

ఇదీ చదవండి: ఏంటీ బిట్​కాయిన్? భారత్​లో పెట్టుబడి పెట్టొచ్చా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.