ETV Bharat / business

భారీగా పెరిగిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Nov 6, 2021, 10:31 AM IST

gold rates today
బంగారం ధరలు

బంగారం (Gold Rate Today) ధర భారీగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. పది గ్రాముల మేలిమి బంగారం ధర శనివారం రూ.370 పెరిగి.. రూ.49,500కి చేరింది. వెండి ధర రూ.847 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (Silver price today) రూ.66,028గా ఉంది.

  • హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,500గా ఉంది. కిలో వెండి ధర రూ.66,028 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు (Gold Price in Vijayawada) రూ.49,500 వద్ద ట్రేడవుతోంది. కేజీ వెండి ధర రూ.66,028కి చేరింది.
  • విశాఖపట్నంలో బంగారం ధర (Gold Price in Vizag) పది గ్రాములకు రూ.49,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,028 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయంగా..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1817.45 డాలర్లుగా ఉంది.
  • స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.20 డాలర్లు వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.108.18గా ఉంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.94.61 వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​ రూ.110.33 కాగా.. డీజిల్​ రూ.96.43 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.109.03గా ఉండగా.. డీజిల్​ ధర రూ.95.17గా ఉంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.