ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Nov 2, 2021, 9:26 AM IST

GOLD RATE TODAY
బంగారం ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధరలు మంగళవారం స్పల్పంగా పెరిగాయి. వెండి ధర కూడా పెరుగుదల నమోదు చేసింది.

బంగారం, వెండి ధరలు (Gold Rate Today) మంగళవారం కాస్త పెరిగాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పసిడి ధర (Gold Price in Hyderabad) రూ.80 పెరిగి.. రూ.49,350కు చేరింది. కిలో వెండిపై ధర రూ.184 పెరిగి.. ధర రూ.66,184 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పుత్తడి (Gold Price in Vijayawada) ధర రూ.49,350గా ఉంది. కిలో వెండి ధర రూ.66,184 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Vizag) రూ.49,350గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,184 వద్ద ట్రేడవుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,791 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.94 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

సామాన్యుడికి చుక్కలే

దేశంలో చమురు ధరల పెంపు ఆగడం లేదు. తాజాగా లీటర్​ పెట్రోల్​పై 37 పైసలు పెంచుతున్నట్లు (Fuel price Today) చమురు సంస్థలు ప్రకటించాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Hyderabad Petrol Price Today) లీటర్ పెట్రోల్​ ధర 38 పైసలు పెరిగి రూ.114.47కు చేరుకుంది. మరోవైపు లీటర్ డీజిల్​ ధర రూ.107.37గా ఉంది.
  • గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్​కు 37 పైసలు పెరిగి రూ.116.43కి చేరింది. డీజిల్​పై ధర​ లీటర్ రూ.108.71 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర 37 పైసలు పెరిగి రూ.115.13కి చేరగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.107.45కి చేరింది.

ఇదీ చూడండి: రికార్డు స్థాయిలో జీఎస్​టీ వసూళ్లు- ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.