ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు

author img

By

Published : Mar 4, 2021, 4:31 PM IST

Gold prices fall Rs 217; silver down by Rs 1,217
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి ధరలు మరోసారి తగ్గాయి. దిల్లీలో గురువారం 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.217 దిగొచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.1,217 తగ్గింది.

బంగారం ధరలు మరోసారి తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడిపై రూ. 217 తగ్గి.. రూ.44,372కు చేరింది.

వెండి కూడా పుత్తడి బాటలోనే పయనించింది. దిల్లీలో కిలో వెండి ధర రూ.1,217 పడిపోయింది. ప్రస్తుతం రూ.66,598గా ఉంది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం, రూపాయి విలువ పెరగడం వల్లే దేశీయంగా పసిడి ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్​ బంగారం ధర 1,717డాలర్లు, వెండి ధర 26.09 డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి: జీఎస్​టీ విధిస్తే రూ.75కే లీటర్ పెట్రోల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.