ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

author img

By

Published : Feb 25, 2022, 11:06 AM IST

Gold price today: రష్యా- ఉక్రెయిన్​ యుద్ధంతో పసిడి ధరలో భారీ పెరిగాయి. గురువారం.. 10 గ్రాముల బంగారం ధర రూ.52 వేలు మార్కును దాటింది. వెండి ధరలోనూ భారీగా మార్పులు జరిగాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Gold price today
Gold price today

Gold price today: బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో పసిడి ధర భారీగా పెరుగుతోంది. శుక్రవారం పది గ్రాముల మేలిమి పుత్తడి ధర.. రూ.1,084‬ మేర ఎగబాకింది. ప్రస్తుతం రూ.52,480 పలుకుతోంది. మరోవైపు, వెండి ధర సైతం భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1,174‬ వృద్ధి చెంది.. ప్రస్తుతం రూ.67,050 పలుకుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: 10 గ్రాముల బంగారం ధర రూ.52,480 గా ఉంది. కిలో వెండి ధర రూ.67,050 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,480 గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,050గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,480 గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,050 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,480 గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,050 పలుకుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,912 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.35 డాలర్లుగా ఉంది.

Gold rate hike

అంతర్జాతీయ పరిణామాలే ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతలు, అమెరికా బాండ్లపై రాబడి తగ్గడం వల్ల బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే అనుమానాల వల్ల.. బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని చెప్పారు.

మరింత పెరుగుతుందా?

ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: ఎన్​ఎస్​ఈ అక్రమాల కేసులో మాజీ జీఓఓ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.