ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Oct 20, 2021, 10:06 AM IST

Gold price today
బంగారం ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా ఎగబాకింది. రెండు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలో (Gold Rate Today) బుధవారం స్వల్పంగా పెరుగుదల నమోదైంది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.50 పెరిగింది. పసిడి బాటలోనే పయనించిన వెండి కిలోకు రూ.800కుపైగా ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.50 పెరిగి (Gold Price in Hyderabad) రూ.48,970 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,914వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,970గా ఉంది. కిలో వెండి ధర రూ.65,914 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.48,970గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,914 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,775 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

దేశంలో ఇంధన ధరలు (Fuel Price today) బుధవారం మళ్లీ పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 37 పైసలు, డీజిల్​పై 38 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 37పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ ధర రూ.110.46కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటరుకు 38 పైసలు వృద్ధి చెంది.. రూ.103.56 కు చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 37 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.112.48గా ఉంది. డీజిల్​ లీటర్​కు 38 పైసలు పెరిగి.. రూ.104.99 వద్ద ఉంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర.. రూ.112.48 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.104.99కి చేరింది.

ఇదీ చూడండి: పన్ను ఎగవేతలో కంపెనీల పోటాపోటీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.