ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Oct 7, 2021, 9:44 AM IST

gold price today
బంగారు, వెండి ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర (Silver price today) మరింత ప్రియమైంది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ రేట్లు (Fuel price today) ఇలా ఉన్నాయి.

బంగారం ధర (Gold Rate Today) గురువారం స్వల్పంగా పెరిగింది. పసిడి బాటలోనే వెండి ధర (Silver price today) కూడా కిలోకు రూ.290 ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.210 పెరిగి.. రూ.48,270వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.290 పెరిగి రూ.62,599గా ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,270గా ఉంది. కిలో వెండి ధర రూ.62,599 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.48,270గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,599 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,760 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.59 డాలర్ల వద్ద ఉంది.

మళ్లీ పెరిగిన పెట్రోల్​, డీజిల్ ధరలు

దేశంలో చమురు ధరల (Petrol price today)​ బాదుడు ఆగడం లేదు. లీటర్​ పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు గురువారం తెలిపాయి.

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 32 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.107.36కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు అధికమై.. లీటర్​కు రూ.100.09కు చేరింది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) 30 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.108.25కు చేరుకుంది. డీజిల్​పై 37 పైసలు పెరిగి.. రూ.100.47కు చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 30 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.109.52గా ఉంది. డీజిల్​ లీటర్​కు 37 పైసలు పెరిగి.. రూ.101.7 వద్ద ఉంది.

ఇదీ చూడండి: పెరిగిన విమాన ప్రయాణాలు- కరోనా నుంచి కోలుకున్నట్లేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.