ETV Bharat / business

50 వేలు దాటిన బంగారం ధర- వెండి కూడా పైపైకి

author img

By

Published : Jul 15, 2020, 6:30 PM IST

Gold jumps Rs 244, silver rises Rs 673
50 వేలు దాటిన 10 గ్రా. బంగారం.. వెండి కూడా పైపైకి

బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 244 పెరగగా.. కిలో వెండి ధర రూ. 54 వేల 200కు చేరింది.

దేశీయ మార్కెట్​లో పసిడి, వెండి ధరలు అంతకంతకూ ఎగబాకుతున్నాయి. పసిడి ధర బుధవారం దిల్లీలో రూ.244 పెరిగింది. ఫలితంగా 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.50230కు చేరింది.

వెండి ధర కిలోకు రూ. 673 పెరిగి... రూ. 54,200గా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్​​లో ఔన్సు పసిడి 1,813 డాలర్లు పలకగా... ఔన్సు వెండి ధర 19.35 డాలర్లుగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం సహా చైనా-అమెరికా మధ్య సంబంధాలు మంగళవారం నుంచి మరింత క్షీణించడం వల్ల పసిడిపై పెట్టుబడులు పెరిగి.. ధరలు పుంజుకుంటున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చూడండి: రిలయన్స్ షేర్ల డీలాతో ఆరంభ లాభాలు ఆవిరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.