దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు అంతకంతకూ ఎగబాకుతున్నాయి. పసిడి ధర బుధవారం దిల్లీలో రూ.244 పెరిగింది. ఫలితంగా 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.50230కు చేరింది.
వెండి ధర కిలోకు రూ. 673 పెరిగి... రూ. 54,200గా నమోదైంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి 1,813 డాలర్లు పలకగా... ఔన్సు వెండి ధర 19.35 డాలర్లుగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం సహా చైనా-అమెరికా మధ్య సంబంధాలు మంగళవారం నుంచి మరింత క్షీణించడం వల్ల పసిడిపై పెట్టుబడులు పెరిగి.. ధరలు పుంజుకుంటున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చూడండి: రిలయన్స్ షేర్ల డీలాతో ఆరంభ లాభాలు ఆవిరి