ETV Bharat / business

రూ.50 వేల దిగువకు చేరిన 10 గ్రా. పసిడి

author img

By

Published : Jul 16, 2020, 6:02 PM IST

Updated : Jul 16, 2020, 7:47 PM IST

Gold falls by Rs 32, silver declines Rs 124
రూ.50 వేల దిగువకు చేరిన 10 గ్రా. పసిడి

బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.32, కిలో వెండి మీద రూ.124 క్షీణించింది.

బంగారం, వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.32 తగ్గి.. రూ. 49,986కు చేరింది. కిలో వెండి ధర రూ.124 తగ్గగా.. రూ.53,810కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు పుత్తడి 1,805 డాలర్ల వద్ద ఉండగా... ఔన్సు వెండి 19.14 డాలర్లకు చేరింది.

అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఔన్సు పసిడి ధర 1,800 డాలర్ల ఎగువనే ట్రేడయిందని విశ్లేషకులు అంటున్నారు.

ఇదీ చూడండి: 'ప్రపంచం మొత్తానికీ భారతీయ వ్యాక్సిన్లు'

Last Updated :Jul 16, 2020, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.