ETV Bharat / business

'ప్రైవేటు పెట్టుబడులతోనే స్థిరంగా దేశ ఆర్థిక వృద్ధి'

author img

By

Published : Nov 16, 2021, 5:54 PM IST

shaktikant das
'అందుకే చమురు ధరలు తగ్గించాము'

దేశ ఆర్థిక వ్యవస్థపై రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గవర్నర్​ శక్తికాంత్​ దాస్ (Shaktikanta Das RBI Governor) ​ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఆర్థికంగా పుంజుకుంటున్నట్లు అనేక గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. పండగ సీజన్ల​ కారణంగా డిమాండ్​ పెరగడం ఇందులో కీలక పాత్ర పోషించిందని తెలిపారు.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు అనేక గణాంకాలు సూచిస్తున్నాయని అన్నారు భారతీయ రిజర్వ్​ బ్యాంక్ గవర్నర్(Shaktikanta Das RBI Governor)​ శక్తికాంత్​ దాస్​. అయితే వృద్ధి స్థిరంగా ఉండాలంటే ప్రైవేటు పెట్టుబడులు కొనసాగాలని తెలిపారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఇంకా పలు చర్యలు చేపట్టాల్సిన (Shaktikanta Das RBI Governor) అవసరం ఉందని అన్నారు.

అత్యంత వేగంగా పుంజుకునే సామర్థ్యం భారత్​కు ఉన్నట్లు (Shaktikanta Das RBI Governor) దాస్​ ధీమా వ్యక్తం చేశారు. అంకురాల స్థాపన, ప్రోత్సాహం విషయంలో భారత్​ టాప్​ పెర్ఫామర్​గా నిలిచిందన్నారు.

పండగ సీజన్ల​ కారణంగా డిమాండ్​ పెరగడం కూడా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంస్థలు ఉపాధి, పెట్టుబడుల పెంపునకు కృషి చేయాలన్నారు.

ఇంధన​ ధరల తగ్గింపు కూడా..

చమురు ధరలను తగ్గిస్తూ ఇటీవల కేంద్రం సహా పలు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని.. ఫలితంగా డిమాండ్ మరింత​ పెరిగే ఆవకాశం ఉందని అభిప్రాయపడ్డారు శక్తికాంత్ దాస్.

వ్యాక్సిన్​ పంపిణీలో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచిన భారత్​.. మహమ్మారి కట్టడికి ముందుండి పోరాడేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి : మూలధన వ్యయం పెంచండి: నిర్మలా సీతారామన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.