జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం వీరాపురంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అల్లాపాడుకు చెందిన ఫోటోగ్రాఫర్ నరసింహ(35) అక్కడిక్కడే మృతి చెందాడు. తెల్లపాడు నుంచి ఎర్రవల్లి చౌరస్తాకు వెళ్తుండగా వీరాపురం సమీపంలో ట్రాక్టర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నరసింహ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న కుంటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడిది బీద కుంటుంబమని... వారిని ఆదుకోవాలని అంబేడ్కర్ కూడలిలో బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పినా లాభంలేకపోయింది. స్థానిక ఎమ్మార్వో జ్యోతి ఆదుకుంటానని హామీ ఇవ్వగా... బంధువులు నిరసన విరమించారు.
ఇవీ చూడండి: నోటిమాటే నిజమైంది..