ETV Bharat / briefs

బస్సు, ట్రక్కు ఢీ.. 11 మంది వలస కార్మికులు మృతి

author img

By

Published : Jun 1, 2020, 11:35 AM IST

Updated : Jun 1, 2020, 11:42 AM IST

వలస కార్మికులతో భారత్ నుంచి నేపాల్​కి వెళ్తున్న ఓ బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 22 మందికి గాయాలయ్యాయి.

11 dead, 22 injured in bus-truck collision in Nepal
బస్సు ట్రక్కు ఢీ... 11 మంది వలస కార్మికులు మృతి

నేపాల్​లో ఘోర విషాదం జరిగింది. భారత్​ నుంచి దక్షిణ నేపాల్​కు వలస కార్మికులతో వెళ్తున్న ఓ బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించగా.. 22 మంది గాయపడ్డారు.

బస్సులో మొత్తం 30 మంది వలస కార్మికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న నేపాల్​ పోలీసులు, సాయుధ బలగాలు, ట్రాఫిక్​ పోలీసులు, బాంకే సాల్యాని సమాజ్​ బృందం ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్మికులు నేపాల్‌గంజ్ మీదుగా సాలియన్‌లోని తమ సొంత జిల్లాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.

పశ్చిమ నేపాల్​కు చెందిన ఎంతో మంది వలస కార్మికులు భారత్​లోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు.

ఇదీ చూడండి:మోదీ 2.0: రెండో ఏడాదిలో తొలి కేబినెట్​ భేటీ

Last Updated :Jun 1, 2020, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.