ETV Bharat / bharat

కొడుకుపై పగతో తల్లిని వివస్త్రను చేసి ఊరేగింపు- స్తంభానికి కట్టేసి దాడి!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 3:38 PM IST

Updated : Dec 11, 2023, 3:59 PM IST

woman paraded naked in karnataka
woman paraded naked in karnataka

Woman Paraded Naked In Karnataka : కొడుకు ప్రేమించిన యువతితో పారిపోయాడని అతడి తల్లిని వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Woman Paraded Naked In Karnataka : ప్రేమించిన యువతితో పారిపోయాడని ఓ యువకుడి తల్లిపై దారుణానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. యువకుడి తల్లిని వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. బాధితురాలు ప్రస్తుతం బెళగావి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

అసలేం జరిగిందంటే?
బెళగావికి చెందిన 24 ఏళ్ల యువకుడు, ఓ యువతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతిని తీసుకుని ఆమె ప్రియుడు పారిపోయాడు. అప్పుడు యువకుడి తల్లిపై యువతి తరఫువారు దాదాపు 8నుంచి 10 మంది దాడికి పాల్పడ్డారు. అనంతరం మహిళను వివస్త్రను చేసి, స్తంభానికి కట్టేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె బెళగావి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితులపై కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం వెతుకున్నారు. అలాగే ఇంటి నుంచి పారిపోయిన ప్రేమికులిద్దరి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు, బెళగావి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని రాష్ట్ర మంత్రి జీ పరమేశ్వర పరామర్శించారు. వధువు తరఫు వారు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే వారే చర్యలు తీసుకునేవారని, లేదంటే గ్రామ పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాల్సిందన్నారు పరమేశ్వర. మహిళపై ఇలాంటి దారుణం జరగడం విచారకరమని పేర్కొన్నారు. బాధితురాలిని హోం మంత్రి పరామర్శించిన సమయంలో ఆయన వెంట బెళగావి నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ఎన్‌. సిద్ధరామప్ప; మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఉన్నారు. అలాగే మహిళను వివస్త్రను చేసిన ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం ఘాటుగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సోదరిని కాల్చి చంపిన యువకుడు
Brother Kills Sister In Uttar Pradesh : ప్రియుడికి మేసేజ్​లు పంపుతుందని సోదరిని కాల్చి చంపాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సహరాన్​పుర్​లో ఆదివారం రాత్రి జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
షేక్‌పురా కదీమ్ గ్రామానికి చెందిన ముస్కాన్ (17) అనే టీనేజర్​ తన మొబైల్​ ఫోన్​లో ప్రియుడితో చాట్ చేస్తోంది. ఆమె సోదరుడు ఆదిత్య మేసేజ్​లు ఆపేయమని ముస్కాన్​ను కోరాడు. అప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా మేసేజ్​లు పంపడం ఆపలేదు ముస్కాన్​. అప్పుడు సోదరిపై కోపంతో ఊగిపోయిన ఆదిత్య నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముస్కాన్ తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అప్పటికే ముస్కాన్​​ మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు.

సోదరిపై ఆదిత్య కాల్పులు జరిపినప్పుడు ఆమె తల్లి బబిత ఇంట్లోని మరో గదిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ముస్కాన్ తమ గ్రామానికే చెందిన వేరే వర్గానికి చెందిన యువకుడితో ప్రేమలో ఉందని స్థానికులు అన్నారు. తన సోదరి వేరే వ్యక్తిని ప్రేమించడం ఆదిత్యకు నచ్చలేదని చెప్పారు.

వివస్త్రను చేసి మహిళపై గ్రామస్థుల దాడి.. కబడ్డీ ఆడుతూ యువకుడు మృతి

ఫ్రెండ్​తో ఫారెస్ట్​కు వెళ్లిన బాలికపై దాడి, వివస్త్రను చేసి వీడియో వైరల్​

Last Updated :Dec 11, 2023, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.