ETV Bharat / bharat

వైన్ షాపుల వద్ద మందుబాబుల బారులు

author img

By

Published : May 11, 2021, 5:42 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో పలు చోట్ల మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో మందుబాబులు దుకాణాల ముందు క్యూ కట్టారు. కరోనా ఆంక్షల కారణంగా మే 3 నుంచి 10 వరకు అక్కడ మద్యం దుకాణాలు తెరవలేదు.

wines shops opened in utterpradesh, people queued up in lines
మధ్యం షాపుల ముందు మందుబాబుల బారులు

కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఉత్తర్​ప్రదేశ్​లో కర్ఫ్యూను మే 17 వరకు పొడిగించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అయితే వ్యాపారుల వినతి మేరకు ఈసారి పలు చోట్ల మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో వారం రోజులుగా మద్యానికి దూరమైన మందుబాబులు వైన్​​ షాపుల ముందు క్యూ కట్టారు.

wines shops opened in utterpradesh, people queued up in lines
మద్యం షాపుల ముందు మందుబాబుల బారులు
wines shops opened in utterpradesh, people queued up in lines
మద్యం షాపుల ముందు మందుబాబుల బారులు
wines shops opened in utterpradesh, people queued up in lines
మద్యం షాపుల ముందు మందుబాబుల బారులు

కొవిడ్​ కట్టడి కోసం మే 3 నుంచి ఆంక్షలు అమలు చేస్తోంది యూపీ ప్రభుత్వం. ఆ తర్వాత మే 6 నుంచి 10 వరకు కర్ఫ్యూ కొనసాగించింది. తాజాగా మరో వారం రోజులు పొడిగించి మే 17 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించింది. వారణాసి గౌతంబుద్ధనగర్​ సహా ఇతర ప్రాంతాల్లో ఈసారి మద్యం దుకాణాలు తెరిచేందుకు అంగీకరించింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు డైరీలు, కూరగాయల మార్కెట్లు, బేకరీలు, మిఠాయి దుకాణాలు తెరిచి ఉంటాయి.

పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రభుత్వ నిర్మాణాలు, హార్డ్​వేర్​ దుకాణాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చింది ప్రభుత్వం.

ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 20,463 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 15,45,212కి చేరింది. మరో 306మంది వైరస్​కు బలి కాగా.. మొత్తం మృతుల సంఖ్య 16,043 పెరిగింది. అయితే గత 10 రోజుల్లేనే 94,000 మంది కోలుకోగా..యాక్టివ్​ కేసుల సంఖ్య 2,16,057కి దిగొచ్చింది.

ఇదీ చూడండి: దేశం 'లాక్​డౌన్'- అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.