ETV Bharat / bharat

'కేంద్రం కాకుంటే.. మేమే టీకాను ఫ్రీగా ఇస్తాం'

author img

By

Published : Jan 13, 2021, 9:20 PM IST

కరోనా టీకాను ప్రజలందరికీ ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కుదిరితే దిల్లీ ప్రజలకు కరోనా టీకాను ఉచితంగా అందిస్తామని ఆయన ప్రకటించారు.

Will provide COVID-19 vaccine free to people of Delhi if Centre fails to do so: Kejriwal
దిల్లీ ప్రజలకు కరోనా టీకా ఫ్రీ'

కరోనా నిరోధానికి ఉచితంగా టీకా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ విఫలమైతే తామే ప్రజలకు అందిస్తామని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ఇప్పటికే తాము కేంద్రాన్ని అభ్యర్థించామని, ఈ టీకా డోసుల ఖర్చును భరించలేని వారెందరో ఈ దేశంలో ఉన్నారన్నారు. దీనిపై కేంద్రం ఏం చేస్తుందో చూడాల్సి ఉందన్నారు.

ఉచితంగా టీకా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతే.. అవసరమైతే తామే ఇస్తామని విలేకర్లతో అన్నారు. కరోనా విధుల్లో ఉండి వైరస్‌ సోకడంతో మరణించిన వైద్యుడు హితేశ్‌ గుప్తా కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.కోటి అందజేశారు. వైద్యుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

దుష్ప్రచారం వద్దు..

వ్యాక్సిన్లపై అసత్యాలు ప్రచారం చేయవద్దని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం, మన శాస్త్రవేత్తలు కలిసి అన్ని ప్రొటోకాల్స్‌ పాటించి భద్రతతో రూపొందించిన ఈ టీకాపై ఎలాంటి సందేహాలూ అవసరం లేదన్నారు. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకొనేందుకు ముందుకురావాలని కోరారు. ఈ టీకాను తొలుత ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ యోధులకు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ టీకా కరోనా నుంచి, గతేడాది కొవిడ్‌ కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. శనివారం నుంచి దిల్లీలోని 89 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.

ఇదీ చదవండి: ఆప్ ఎమ్మెల్యేపై యూపీలో సిరా దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.