ETV Bharat / bharat

Wife Killed Husband : భర్తను చంపేసి సెప్టిక్ ట్యాంక్​లో పడేసిన భార్య.. 8ఏళ్ల తర్వాత అరెస్ట్.. ఎలాగో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 8:33 PM IST

Police arrested wife who killed husband and threw him in septic tank after 8 years
Police arrested wife who killed husband and threw him in septic tank after 8 years

Wife Killed Husband : రోజూ మద్యం తాగొచ్చి గొడవపడుతున్నాడని భర్తను చంపేసి ఇంటి బయట ఉన్న సెప్టిక్​ ట్యాంక్​లో పడేసింది ఓ భార్య. 8 ఏళ్ల తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో జరిగిందీ ఘటన.

Wife Killed Husband : తమిళనాడులోని శివగంగైలో.. భర్తను భార్య చంపేసి సెప్టిక్​ ట్యాంక్​లో పడేసింది. ఇంటి యజమాని సెప్టిక్​ ట్యాంక్​ శుభ్రం చేయిస్తుండగా.. అస్థిపంజరం బయటపడడం వల్ల అసలు విషయం 8 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవకొట్టై గంబర్​ వీధిలో శరవణన్​ అనే వ్యక్తి.. తన ఇంటి బయట ఉన్న సెప్టిక్​ ట్యాంక్​ను శుభ్రం చేయించాడు. ఆ సమయంలో సెప్టిక్​ ట్యాంక్​లో నుంచి అస్థిపంజర భాగం, ఒక షర్ట్, ఒక గాజు ముక్క బయటపడ్డాయి​. ఒక్కసారిగా వాటిని చూసి భయపడ్డ శరవణన్.. దేవకొట్టై​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Police arrested wife who killed husband and threw him in septic tank after 8 years
మృతుడు పాండియన్​

"ఎనిమిదేళ్ల క్రితం.. నా ఇంట్లో పాండియన్​ అనే వ్యక్తి కుటుంబంతో అద్దెకు దిగాడు. అతడికి భార్య సుగంతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పాండియన్​(44) బస్సు​ కండక్టర్​గా పనిచేసేవాడు. అతడు తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. భార్యతో ఎప్పుడూ గొడవపడేవాడు. నాకు వారిపైనే అనుమానం ఉంది" అని ఇంటి యజమాని శరవణన్​ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సుగంతిని అదుపులో తీసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆమె నేరం అంగీకరించింది. 2014లో తన భర్త మద్యం తాగి ఇంటికి వచ్చినట్లు తెలిపింది. ఆ సమయంలో వాగ్వాదం జరగడం వల్ల హత్య చేసి సెప్టిక్​ ట్యాంక్​లో పడేసినట్లు చెప్పింది. అదే ఇంట్లో తాను ఆరు నెలలపాటు ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్​ చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

అంతకుముందు.. 2014లోనే మరణించిన పాండియన్​ తండ్రి తన కుమారుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో సుగంతి పోలీసులను విచారించారు. తన భర్త కోయబత్తూరులో ఉద్యోగం చేస్తున్నాడని.. అక్కడ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సుగంతి తెలిపింది. అప్పుడప్పుడు తనకు డబ్బులు పంపిస్తున్నాడని చెప్పింది. దీంతో పోలీసులు అప్పుడు విచారణను కొనసాగించలేదు. ఇప్పుడు సెప్టిక్​ ట్యాంక్​ క్లీనింగ్​ వల్ల మొత్తం బండారం బయటపడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.