ETV Bharat / bharat

'ప్రతిరోజు 200 మంది రైతులతో నిరసన'

author img

By

Published : Jul 14, 2021, 12:47 PM IST

tikait on parliament protest, బీకేయూ నేత రాకేశ్​ టికాయిత్
'200 మందితో శాంతియుతంగానే నిరసన'

పార్లమెంటు వద్ద ప్రతి రోజు 200 మందితో శాంతియుతంగా నిరసన తెలుపుతామని రాకేశ్​ టికాయిత్​ వెల్లడించారు. ఈ నిరసనలపై వ్యూహ రచన చేసేందుకు బుధవారం రైతు నేతలు సమావేశమవుతున్నట్లు చెప్పారు.

పార్లమెంటు వద్ద శాంతియుతంగా నిరసనలు చేపడతామని బీకేయూ నేత రాకేశ్​ టికాయిత్​ తెలిపారు. బస్సుల ద్వారా ప్రతి రోజు 200 మంది రైతులు పార్లమెంటుకు చేరుకుంటారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికపై చర్చించేందుకు రైతు నేతలు బుధవారం సమావేశమవుతున్నట్లు చెప్పారు.

"200 మందితో పార్లమెంటుకు బస్సుల్లో చేరుకుంటాం. టికెట్​ డబ్బులు చెల్లిస్తాం. పార్లమెంటు బయట కూర్చొని సమావేశాలు జరుగుతున్న సమయంలో శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తాం. ఈ రోజు చర్చలు జరిపి నిరసనలపై ప్రణాళిక సిద్ధం చేస్తాం."

-రాకేశ్​ టికాయిత్​, బీకేయూ నేత

సాగు చట్టాల రద్దుపై నిరసన వ్యక్తం చేసేందుకు ఈనెల 22 నుంచి పార్లమెంటు ఎదుట ఆందోళన చేస్తామని రైతు సంఘాలు ఇదివరకే ప్రకటించాయి. ఈ నిరసనలపై వ్యూహ రచనకు భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ విషయాలు వెల్లడించారు టికాయిత్​.

ఈనెల 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఇదీ చదవండి : 'మాటలే.. టీకాల్లేవు' - కేంద్రంపై రాహుల్​ ధ్వజం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.