ETV Bharat / bharat

బంగాల్:​ ఈసీ అఖిలపక్ష భేటీలో భిన్న వాదనలు

author img

By

Published : Apr 16, 2021, 8:30 PM IST

బంగాల్​లో కరోనా తీవ్రత దృష్ట్యా వివిధ పార్టీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించింది ఎన్నికల సంఘం. ఒకేసారి పోలింగ్​ నిర్వహించాలని ఈసీని తృణమూల్​ కాంగ్రెస్​ కోరింది. కాగా ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎన్నికలను యథావిధిగానే నిర్వహించాలని.. ఒకే రోజు నిర్వహించవద్దని సూచించింది భాజపా.

CEO
ఈసీ

బంగాల్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలతో అఖిల పక్ష భేటీ నిర్వహించింది ఎన్నికల సంఘం. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై భిన్న వాదనలు వినిపించాయి పార్టీలు. మిగతా మూడు దశల పోలింగ్​లను కలిపి ఒకే రోజు నిర్వహించాలని కోరింది అధికార తృణమూల్​ కాంగ్రెస్​. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేది లేదని ఈసీ సీనియర్​ అధికారి ఒకరు స్పష్టం చేశారు. కొవిడ్​ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి ఆరిజ్​ అఫ్తాబ్​.. రాజకీయ పార్టీలకు సూచించారు.

శనివారం జరిగే 5వ దశ పోలింగ్​ మినాహా..మిగిలిన మూడు విడతల పోలింగ్​లను కలిపి ఒకే రోజు నిర్వహించాలని ఈసీని తృణమూల్​ కాంగ్రెస్​ కోరింది. కాగా ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎన్నికలకు ఆటంకం కలిగించవద్దని.. మూడు దశల పోలింగ్​లను ఒకే రోజు నిర్వహించవద్దని ఈసీని భాజపా కోరింది.

అయితే.. ఒకేరోజు పోలింగ్ నిర్వహించేది లేదని ఇప్పటికే స్పష్టత నిచ్చింది ఎన్నికల సంఘం. అఖిల పక్ష భేటీలోనూ అదే విషయాన్ని రాజకీయ పార్టీలకు తెలిపింది.

శనివారం రోజు ఐదో దశ పోలింగ్​ జరగనుంది. ఆరో విడత పోలింగ్​ ఏప్రిల్​ 22న, ఏడు, ఎనిమిది దశల పోలింగ్​ వరుసగా ఏప్రిల్​26, 29 తేదీలలో జరగనున్నాయి. మే2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఇదీ చదవండి: 'అందుకే దీదీ వారికి పౌరసత్వం ఇవ్వడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.