ETV Bharat / bharat

మాస్క్ ధరించిన శునకం​.. దృశ్యాలు వైరల్​

author img

By

Published : Apr 30, 2021, 11:50 AM IST

దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభణ వేళ ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పోలీసులు, అధికారులు చేస్తున్న విజ్ఞప్తిని బేఖాతరు చేస్తున్నారు కొందరు. అయితే మనుషులతో పాటు జంతువులపైనా కరోనా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో తన పెంపుడు శునకానికీ మాస్కు ధరింపజేశాడో వ్యక్తి. కర్ణాటకలో కనిపించిన ఈ దృశ్యం పోలీసులతో పాటు.. పాదచారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆలోచింపజేస్తోంది.

dog mask
కుక్కకూ కావాలి ఓ మాస్క్!

కరోనా విజృంభణ నేపథ్యంలో కర్ణాటకలో ప్రస్తుతం రెండు వారాల కర్ఫ్యూ అమల్లో ఉంది. పౌరులందరూ నిబంధనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దక్షిణ కన్నడలోని పుత్తూరుకు చెందిన ప్రవీణ్ డిసౌజా అనే వ్యక్తి ఒక అడుగు ముందుకేసి తన పెంపుడు శునకానికి సైతం మాస్కును ధరింపజేశాడు. పోలీసులు, అధికారుల ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాడు.

dog mask
కుక్కకూ కావాలి ఓ మాస్క్!

పుత్తూరు పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు.. ప్రవీణ్ స్కూటీపై మాస్కు పెట్టుకుని నిశ్శబ్దంగా ఉన్న పెంపుడు జంతువును చూసి ఆశ్చర్యపోయారు. నగరంలో డ్రైవింగ్ స్కూల్​ను నిర్వహించే ప్రవీణ్.. మాస్కు ధరించడమే గాక, తన పెంపుడు జంతువుకు సైతం మాస్కు పెట్టి సురక్షిత సందేశాన్నిస్తున్నాడని కొనియాడారు.

dog mask
కుక్కకూ కావాలి ఓ మాస్క్!

ఇతరులకూ ఇదేవిధంగా అవగాహన కల్పించాలని ప్రవీణ్​కు‌ సూచించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇవీ చదవండి: కరోనా బాధితులకు అండగా 'ఆదర్శ కుటుంబం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.