ETV Bharat / bharat

'స్వావలంబన భారత్​కు అంకితం కావాలి'

author img

By

Published : Jan 26, 2021, 5:49 AM IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వావలంబన భారత్​ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.

VP Naidu calls on citizens to dedicate themselves towards building self-reliant India
'స్వావలంబన భారత్​ కోసం అందరూ పాటుపడాలి'

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం వంటి ఆదర్శాలను ఆధారంగా తీసుకొని రాజ్యాంగ, గణతంత్ర వ్యవస్థాపక సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని ఉద్ఘాటించారు. అలాగే స్వావలంబన భారత్​ కోసం ప్రజలు అంకితం కావాలని పిలుపునిచ్చారు.

"మన ప్రజాస్వామ్యం శక్తిమంతమైంది. సుపరిపాలనకు కట్టుబడి ఉంది. దేశంలో పారదర్శకత గతంలో కంటే మెరుగ్గా ఉంది. నాగరికత ఆదర్శాలు, రాజ్యాంగ విలువలతో కూడిన శాంతియుత, శ్రావ్యమైన, ప్రగతిశీల భారత్​ను నిర్మించడానికి మనల్ని మనం అంకితం చేసుకునేందుకు ప్రతిజ్ఞ చేసుకోవాలి."

- ఎం వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

ఇదీ చూడండి: రిపబ్లిక్​ డే- దేశ రాజధానిలో పటిష్ఠ భద్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.